Rohit-Ishan Kishan: ఇషాన్ కిషన్ కోసమే ఇన్నింగ్స్ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేశా: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma explains why India Innings Declares Late in 1st Test vs West Indies: వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టింది. విండీస్పై ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ (171), కెప్టెన్ రోహిత్ శర్మ (103) సెంచరీలు చేయగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (76) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (12/131) తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ని భారత్ ఘనంగా ప్రారంభించింది.
మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘దేశం కోసం చేసే ప్రతి పరుగూ ఎంతో విలువైంది. మేం బౌలింగ్ను బాగా ప్రారంభించాం. అందుకే విండీస్ను తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌట్ చేయగలిగాం. ఈ పిచ్ మీద బ్యాటింగ్ కష్టమని మాకు తెలుసు. క్రీజ్లో కుదురుకుని నిలకడగా ఆడితే పరుగులు వస్తాయని అనుకున్నాము. మేము ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాం. 400కిపైగా పరుగులు చేయడంతో మా బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ లభించింది. రెండో ఇన్నింగ్స్లోనూ విండీస్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు’ అని అన్నాడు.
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
Also Read: Ashwin-Harbhajan: హర్భజన్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్.. ఇక అనిల్ కుంబ్లే టార్గెట్!
‘యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు మంచి ప్రతిభ ఉంది. ఎప్పటి నుంచో జట్టు కోసం సిద్ధమవుతూ ఉన్నాడు. తొలి టెస్టులోనే చాలా అద్భుతంగా ఆడాడు. ఎక్కడా కంగారు పడలేదు. టీ20ల్లో ప్రదర్శించిన దూకుడును నియంత్రించుకుంటూ పరుగులు చేసాడు. ఆటను మరింత ఆస్వాదించి ఆడితే పరుగులు వస్తాయని నేను చెప్పా. ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేయడం స్పష్టతతో ఉన్నాం. విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత చేద్దామనుకున్నాం. అయితే ఇషాన్ కిషన్ తన తొలి టెస్టు మ్యాచ్లో బ్యాటింగ్ చేయాలని ఆత్రుతగా ఉన్నాడు. అందుకే అతడు సింగిల్ కొట్టిన తర్వాత ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేశాం’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత ఇషాన్ కిషన్ క్రీజ్లోకి వచ్చాడు. అయితే తొలి పరుగు చేయడానికి దాదాపుగా 20 బంతులు ఆడాడు. కిషన్ సింగిల్ తీయగానే భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 421/5 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ 150 పరుగులకు ఆలౌటై కాగా.. రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో టెస్టు జులై 20న ఆరంభం కానుంది.
Also Read: iPhone 14 Price Drop: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర!
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!