Rohit Sharma: రోహిత్, యశస్వి, శ్రేయస్ లేకుండానే బరిలోకి జట్టు!
- ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో వన్డే సిరీస్
- రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి ముంబై
- యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం రోహిత్ భారత జట్టుతో చేరాడు. దీంతో గురువారం మేఘాలయాతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్లో ముంబై హిట్మ్యాన్ లేకుండానే ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కూడా ముంబై తరఫున బరిలో దిగడం లేదు. వీరి స్థానాల్లో ఆంగ్క్రిష్ రఘువంశి, సూర్యాంష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్లను తీసుకున్నట్లు మంగళవారం ముంబై ప్రకటించింది.
ఇటీవల భారత టెస్టు జట్టు ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో వైట్వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ రెండు సిరీస్లలో కెప్టెన్, బ్యాటర్గా హిట్మ్యాన్ విఫలమయ్యాడు. దాంతో టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలంటూ రోహిత్కు మాజీ క్రికెటర్లు సూచనలు చేశారు. ఈ విమర్శలపై స్పందించని హిట్మ్యాన్.. బీసీసీఐ ఆదేశాల మేరకు రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. సొంత జట్టు ముంబై తరఫున రంజీ రెండో దశ పోటీల్లో జమ్మూ కశ్మీర్పై ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 3, రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులు చేసి నిరాశపర్చాడు. మరి వన్డే సిరీస్లో అయినా రాణిస్తాడేమో చూడాలి.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!