Rohit Sharma: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. ఏకైక బ్యాటర్గా హిట్మ్యాన్!
- రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు
- అంతర్జాతీయ క్రికెట్లో 50వ సెంచరీ
- ఏకైక బ్యాటర్గా హిట్మ్యాన్ రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma World Record: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడంతో ఈ రికార్డు హిట్మ్యాన్ అందుకున్నాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో ఐదు శతకాలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మన్గా రోహిత్ ఉన్నాడు. ఇప్పటివరకూఈ రికార్డు ఎవరి వల్లా సాధ్యం కాలేదు.
ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్గా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ 33 ఇన్నింగ్స్లలో 6 శతకాలు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (32 ఇన్నింగ్స్లలో 5 సెంచరీలు), కుమార్ సంగక్కర (49 ఇన్నింగ్స్లలో 5 సెంచరీలు)లు ఉన్నారు. ఇక ఓ ప్రత్యర్థిపై అత్యధిక వన్డే శతకాలు బాదిన జాబితాలో హిట్మ్యాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ శ్రీలంకపై 10 శతకాలు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ వెస్టిండీస్ జట్టుపై 9, సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 9, రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై సెంచరీలు చేశారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
Also Read: Rohit-Kohli: సిడ్నీలో దుమ్ములేపిన రోహిత్, కోహ్లీ.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆసీస్ నిర్ధేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.3 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (74; 81 బంతుల్లో, 7 ఫోర్లు) రాణించారు. రోకో చెలరేగడంతో ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. శుభ్మన్ గిల్ (24) మంచి ఆరంభం ఇచ్చినా భారీ స్కోర్ చేయలేకపోయాడు. టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?