Rohit Sharma: ఐపీఎల్లో రోహిత్ శర్మ రికార్డుల మోత… సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ..
- ఐపీఎల్లో రోహిత్ శర్మ రికార్డుల మోత
- సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
- ఐపీఎల్లో 7 వేల పరుగుల మార్కును తాకిన రెండవ బ్యాట్స్మన్ రోహిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో మే 30 (శుక్రవారం)న గుజరాత్ టైటాన్స్ (GT) ముంబై ఇండియన్స్ (MI)తో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్లింది. ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్తో అద్భుతంగా రాణించాడు. హిట్మ్యాన్ 50 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ప్రసీధ్ కృష్ణ బౌలింగ్లో రషీద్ఖాన్కి క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. కాగా ఐపీఎల్ లో రోహిత్ రికార్డుల మోత మోగించాడు.
Also Read:Lal Salam : ఎట్టకేలకు ఓటీటీలోకి రజినీకాంత్ ‘లాల్ సలాం’..
Also Read
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్లో 47వ అర్ధశతకం. ఈ ఇన్నింగ్స్లో రోహిత్ ఐపీఎల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది మాత్రమే కాదు, రోహిత్ శర్మ ఐపీఎల్లో 300 సిక్సర్లు కూడా పూర్తి చేశాడు. కరేబియన్ లెజెండ్ క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్లో 300 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. క్రిస్ గేల్ ఐపీఎల్లో 357 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ తన 266వ ఐపీఎల్ ఇన్నింగ్స్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో 7 వేల పరుగుల మార్కును తాకిన రెండవ బ్యాట్స్మన్ రోహిత్. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఇప్పటివరకు 266 మ్యాచ్ల్లో 39.53 సగటుతో 8618 పరుగులు చేశాడు. ఈ కాలంలో కోహ్లీ 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు సాధించాడు.
Also Read:Nara Lokesh: లోకేష్ ప్రమోషన్ని కావాలనే పెండింగ్లో పెట్టారా..?
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ముందు 229 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పో్యిన జీటీ 208 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో, 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ముంబై.. ఐపీఎల్ క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది. ఆదివారం రోజు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలబడబోతోంది ముంబై ఇండియన్స్.
He is in the mood tonight 😎
Rohit Sharma, the 𝐁𝐢𝐠 𝐌𝐚𝐭𝐜𝐡 𝐏𝐥𝐚𝐲𝐞𝐫 🫡
Updates ▶ https://t.co/R4RTzjQfph #TATAIPL | #GTvMI | #Eliminator | #TheLastMile | @ImRo45 pic.twitter.com/WJsarasZuI
— IndianPremierLeague (@IPL) May 30, 2025
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!