IPL 2025: ఐపీఎల్ ‘డాడీ’.. 1000 సిక్స్లు, 300+ స్కోర్స్ పక్కా!
- మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం
- ఐపీఎల్ 2025లో 1000 సిక్స్లు పక్కా
- ప్రపంచంలో ఐపీఎల్ ప్రధాన టీ20 లీగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ‘డాడీ’ అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. ప్రతీ సీజన్ మరింత ఉత్సాహంగా అభిమానులను అలరిస్తోందన్నారు. ఐపీఎల్ 2025లో కచ్చితంగా 1000 సిక్స్లు, 300+ స్కోర్లను కూడా చూసే అవకాశం లేకపోలేదని అభిపాయపడ్డాడు. ఐపీఎల్ 18వ సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఉతప్ప అన్నాడు. శనివారం (మార్చి 22) నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది.
‘ఐపీఎల్ రాకతో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆటపై ప్రేమ ఉన్నప్పటికీ.. కొంతమంది కొనసాగించలేకపోతున్నారు. గేమ్ ఇప్పుడు ఉద్వేగభరితంగా మారిపోయింది. అదే సమయంలో అభిమానుల్లో ఉత్సాహంను తీసుకొచ్చింది. ప్రపంచంలో ఐపీఎల్ ప్రధాన టీ20 లీగ్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్లకు ఐపీఎల్ ‘డాడీ’ అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ విజయవంతం కావడానికి ఆవిష్కరణలే ప్రధాన కారణం. గత సీజన్ కంటే ఈ సీజన్ మరింత ఉత్సాహంగా అభిమానులను అలరించనుంది. ఈ సీజన్లో 1000 సిక్స్లు నమోదవుతాయి. 300+ స్కోర్లను కూడా చూసే అవకాశం లేకపోలేదు. 275 పరుగులకు పైగా ఛేజింగ్ చేసే జట్టును చూడవచ్చు. డబుల్ హ్యాట్రిక్ లేదా 150 పరుగులు చేసే ఆటగాడిని కూడా మనం చూడవచ్చు’ అని రాబిన్ ఉతప్ప చెప్పుకొచ్చాడు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
2024 ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ లీగ్ చరిత్రలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు సాధించిన జట్టుగా రెండుసార్లు రికార్డు సృష్టించింది. 277/3 స్కోరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2013లో నెలకొల్పిన 263/5 రికార్డును సన్రైజర్స్ బ్రేక్ చేసింది. ఆపై 287/3 స్కోరును నమోదు చేసి మరో రికార్డు నెలకొల్పింది. రికార్డులు ఈజీగా బద్దలవుతున్నందున 2025 ఐపీఎల్లో సంచనాలు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని రాబిన్ ఉతప్ప అభిపాయపడ్డాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ జట్లకు ఉతప్ప ఆడాడు. 2022లో రిటైర్ అయి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..