Vegetable Prices: పెరుగుతున్న కూరగాయల ధరలు.. స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- గత కొన్ని రోజులుగా దేశంలో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
- పెరుగుతూనే ఉన్న బంగాళదుంపలు.. ఉల్లిపాయలు.. టమోటాల ధరలు
- 15 శాతం నుంచి 58 శాతానికి పెరిగిన రిటైల్ ధరలు
- రానున్న రోజుల్లో ధరలు అదుపులోకి రానున్నాయని తెలిపిన కేంద్ర ప్రభుత్వం
- ఆర్థిక సర్వేలో కూరగాయల ధరలు పెరగడానికి గల కారణాలు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని రోజులుగా దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. టమోటా, ఉల్లి, బంగాళదుంప వంటి నిత్యావసర కూరగాయల రిటైల్ ధరలు.. 15 శాతం నుంచి 58 శాతానికి పెరిగాయి. అందుకు కారణం వర్షం ప్రభావంతో పాటు.. ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న రోజుల్లో ధరలు అదుపులోకి రానున్నాయని తెలిపింది. అయితే కూరగాయల ధరలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి? దీని వెనుక ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం.
Central Government Jobs: ఉద్యోగాల జాతర.. ఏకంగా 71,321 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
Also Read
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
ఇటీవల పార్లమెంట్లో సమర్పించిన ఆర్థిక సర్వేలో కూరగాయల ధరలు పెరగడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రతికూల వాతావరణం, పంట నష్టాలు గత రెండేళ్లలో వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేశాయని ప్రభుత్వం నివేదించింది. ఈ కారణంగా.. ఆహార ధరలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంది. కేవలం కూరగాయల ధరలే కాకుండా.. పప్పుధాన్యాల ఉత్పత్తిని కూడా ప్రభావితం చేశాయని తెలిపింది. 2023-2024లో దేశంలో చాలా ప్రతికూల వాతావరణ సంఘటనలు జరుగుతాయని నివేదికలో చెప్పారు. దీంతో పంటలకు చాలా నష్టం వాటిల్లింది. అంతే కాకుండా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిజర్వాయర్ స్థాయిలు క్షీణించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఆహార ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. అందువల్ల.. వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం FY22లో 3.8 శాతం నుండి FY23లో 6.6 శాతానికి.. FY24లో 7.5 శాతానికి పెరిగింది.
Fertility: IVF సెంటర్లకు పరుగుపెడుతున్న భారతీయులు.. పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. కారణాలేంటి..?
వాతావరణ మార్పుల కారణంగా ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక సర్వేలో తేలింది. అంతే కాకుండా.. ఆయా ప్రాంతాల వారీగా పంటలకు వచ్చే వ్యాధుల కారణంగా కూరగాయల సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో.. మార్కెట్లోకి దిగుబడి తగ్గి ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా టమాట ధరలు పెరిగాయి. గత రెండేళ్ళలో ప్రతికూల వాతావరణం.. తక్కువ ఉత్పత్తి కారణంగా ఉల్లి ధరలు, కందిపప్పు ధరలు పెరిగాయి. అయితే రబీ సీజన్లో నెమ్మదిగా విత్తడం, దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణ అవాంతరాల కారణంగా పలు ఉత్పత్తులు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?