Rishi Sunak: రిషి సునాక్ కీలక ప్రకటన.. భారత్తో కలిసి పని చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు. G20 సదస్సును విజయవంతం చేయడంలో UK మద్దతు ఇస్తుందని రిషి సునాక్ పేర్కొన్నారు.
Read Also: Jawan Preview: మార్కెట్లో మెంటల్ ఎక్కిస్తున్న ‘జవాన్’ ప్రివ్యూ
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
అంతేకాకుండా.. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి జీ-20 అధ్యక్షుడిగా భారత్తో కలిసి పని చేస్తామని బ్రిటన్ ప్రధాని చెప్పారు. ఇండియా 10 సంవత్సరాలలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మరోవైపు ప్రధాని మోడీతో తన భేటీలో ప్రపంచ సవాళ్ల గురించి, వాటిని ఎదుర్కోవడంలో బ్రిటన్, భారత్ల పెద్ద పాత్ర గురించి మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. తాను ప్రధానమంత్రి కావడం పట్ల భారత ప్రజలు అపూర్వస్పందన చూపించారన్నారు. భారత్తో సంబంధాల పట్ల చాలా గర్వంగా ఉందని రిషి సునాక్ తెలిపారు. తన భార్య భారతీయురాలు అని గర్వించదగిన హిందువుగా భారతదేశ ప్రజలతో ఎల్లప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉంటానన్నారు.
Read Also: Asia Cup 2023: శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఇక మ్యాచ్లకు ఇబ్బందేమీ లేదు
మరోవైపు ఖలిస్తానీ మద్దతుదారుల కార్యకలాపాలపై భారతదేశంలో పెరుగుతున్న ఆందోళనలపై బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు. ఖలిస్థాన్ అనుకూల ఛాందసవాదాన్ని ఎదుర్కోవడానికి బ్రిటన్.. భారత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తోందని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ మాట్లాడుతూ.., బ్రిటన్లో ఏ విధమైన ఛాందసవాదం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?