Rishi Sunak: రిషి సునాక్ కీలక ప్రకటన.. భారత్తో కలిసి పని చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరుగనున్న G-20 సదస్సుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 భారతదేశానికి గొప్ప సంవత్సరం అని అన్నారు. భారతదేశం ప్రపంచ నాయకత్వాన్ని చూపడం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. G20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం యొక్క స్థాయి, వైవిధ్యం మరియు అసాధారణ విజయాలు G20 అధ్యక్షతన సరైన సమయంలో సరైన దేశం నిర్వహిస్తోందని తెలిపారు. G20 సదస్సును విజయవంతం చేయడంలో UK మద్దతు ఇస్తుందని రిషి సునాక్ పేర్కొన్నారు.
Read Also: Jawan Preview: మార్కెట్లో మెంటల్ ఎక్కిస్తున్న ‘జవాన్’ ప్రివ్యూ
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
అంతేకాకుండా.. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి జీ-20 అధ్యక్షుడిగా భారత్తో కలిసి పని చేస్తామని బ్రిటన్ ప్రధాని చెప్పారు. ఇండియా 10 సంవత్సరాలలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మరోవైపు ప్రధాని మోడీతో తన భేటీలో ప్రపంచ సవాళ్ల గురించి, వాటిని ఎదుర్కోవడంలో బ్రిటన్, భారత్ల పెద్ద పాత్ర గురించి మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. తాను ప్రధానమంత్రి కావడం పట్ల భారత ప్రజలు అపూర్వస్పందన చూపించారన్నారు. భారత్తో సంబంధాల పట్ల చాలా గర్వంగా ఉందని రిషి సునాక్ తెలిపారు. తన భార్య భారతీయురాలు అని గర్వించదగిన హిందువుగా భారతదేశ ప్రజలతో ఎల్లప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉంటానన్నారు.
Read Also: Asia Cup 2023: శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఇక మ్యాచ్లకు ఇబ్బందేమీ లేదు
మరోవైపు ఖలిస్తానీ మద్దతుదారుల కార్యకలాపాలపై భారతదేశంలో పెరుగుతున్న ఆందోళనలపై బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు. ఖలిస్థాన్ అనుకూల ఛాందసవాదాన్ని ఎదుర్కోవడానికి బ్రిటన్.. భారత ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తోందని తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ మాట్లాడుతూ.., బ్రిటన్లో ఏ విధమైన ఛాందసవాదం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!