UK PM Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK PM Rishi Sunak: ఎట్టకేలకు భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 357 సీట్లు గల బ్రిటన్ పార్లమెంట్లో అత్యధికంగా రిషి సునాక్కు మద్దతు ప్రకటించడంతో ఆయన యూకే ప్రధాని అయ్యారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇక రేసులో మిగిలి ఉన్న పెన్నీ మోర్డాంట్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఫలితంగా బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టించారు.
మాజీ బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ విధేయురాలు అయిన ప్రీతి పటేల్ కూడా రిషి సునాక్కు మద్దతు ఇచ్చారు. బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి పోటీ నుంచి వైదొలగుతున్నానని ప్రకటించిన అనంతరం ఆమె రిషి సునాక్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజాసేవకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రీతి పటేల్ అన్నారు. దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి రిషి సునాక్కు మద్దతుగా నిలవాలన్నారు.
Also Read
- ‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
- TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
లిజ్ ట్రాస్ రాజీనామా చేయగానే.. ప్రధాని పదవి కోసం బోరిస్ మరోసారి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా వేగంగా పావులు కదిపారు. దాదాపు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపినట్లు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోటీ లేకుండా ప్రధాని అయ్యేందుకు ఆయన రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్తో చర్చలు జరపగా వారు రేసు నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. మరోవైపు రిషి సునాక్కు అత్యధికంగా ఎంపీలు అండగా ఉన్నారు. దీంతో రిషితో పోటీపడి గెలవలేనని భావించిన బోరిస్.. ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీని తాను ఏకం చేయలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయినా తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దేశానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిషి సునాక్ విజయం సునాయాసమైంది. ప్రస్తుతం ఉన్న యూకే ఆర్థిక పరిస్థితిని చక్క దిద్దడానికి ఇప్పుడు రిషి సునాక్ కీలకమని అక్కడి ఎంపీలు భావిస్తున్నారు. భారత్తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందంతో బ్రిటన్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని.. అందుకు రిషి సునాక్ సేవలు అవసరమని బ్రిటన్ ఎంపీలు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
-
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!