Rishabh Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై క్లారిటీ.. ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. ముఖం మీద అయిన గాయాలకు డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు పేర్కొన్నారు. తొలుత ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని భావించినప్పటికీ.. మ్యాక్స్లోనే శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ మేరకు శ్యామ్ శర్మ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారత వికెట్ కీపర్-బ్యాటర్ శుక్రవారం ఉదయం తన మెర్సిడెస్ బెంజ్లో ఢిల్లీ నుండి డెహ్రాడూన్కు వెళ్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యాడు. డివైడర్ను ఢీకొట్టడంతో అతని కారు మంటల్లో చిక్కుకుంది. పంత్ తన కుడి మోకాలిలో లిగమెంట్ స్థానభ్రంశం కాగా.. అతని నుదిటిపై గాయాలైనప్పటికీ అదృష్టవశాత్తు కారు నుంచి బయట పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
Mercedes Car: రిషబ్ పంత్ బతికున్నాడంటే “కారు” కూడా కారణమే.. ఆ కారు ప్రత్యేకతలివే..
Also Read
- WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
“రిషబ్ పంత్ తన నుదిటి దగ్గర చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. 3 మంది సభ్యుల డీడీసీఏ బృందం డెహ్రాడూన్ చేరుకుంది. బీసీసీఐ మ్యాక్స్ హాస్పిటల్లోని డాక్టర్లతో, పంత్ కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం అతను నిలకడగా ఉన్నాడు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు.” అని డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. శ్యామ్ శర్మ కూడా క్రికెట్ స్టార్కు అందిస్తున్న చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేశా మెదడు, వెన్నెముకకు సంబంధించిన ఎంఆర్ఐ స్కానింగ్లో ఎలాంటి సమస్య లేదని, అంతా సాధారణంగా ఉన్నట్లు తాజాగా వైద్యులు ప్రకటించారు. ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన సీసీ కెమెరాల్లో ఫుటేజీ ప్రకారం.. పంత్ కారు డివైడర్ను ఢీకొట్టిన క్షణాల్లోనే మంటలు అంటుకొన్నట్లు తెలుస్తోంది. అయితే హైవేలో ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు వెంటనే పంత్ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!