Duleep Trophy 2024: అందుకే నన్ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు: రింకు సింగ్
- సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ
- రింకు సింగ్ను పక్కనపెట్టిన బీసీసీఐ
- కారణం ఏంటో చెప్పిన రింకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh about Duleep Trophy omission: సెప్టెంబర్ 5 నుంచి దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 ఆరంభం కానుంది. ఈ టోర్నీలో బరిలోకి దిగే నాలుగు జట్లకు శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్లు కెప్లెన్లుగా ఎంపికయ్యారు. దాదాపుగా అందరు భారత క్రికెటర్స్ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఆడనున్నాడు. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్లు మొదటి రౌండ్లో ఆడనున్నట్లు తెలుస్తోంది.
దులీప్ ట్రోఫీ 2024కి యువ బ్యాటర్ రింకు సింగ్ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రింకును ఎందుకు తీసుకోలేదని సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తాజాగా ఈ విషయంపై రింకు స్పందించాడు. గత సీజన్లో గొప్ప ప్రదర్శన చేయకపోవడంతో.. తనకు ఈ సీజన్లో ఆడే అవకాశం రాలేదన్నాడు. స్పోర్ట్స్ టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రింకు మాట్లాడుతూ… ‘నేను గత దేశవాళీ సీజన్లో బాగా ఆడలేదు. రంజీ ట్రోఫీలో కూడా ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కేవలం 2-3 మ్యాచ్లు మాత్రమే ఆడా. నేను పెద్దగా రాణించకపోవడంతో ఇప్పుడు ఎంపిక చేయలేదు. అయితే తప్పకుండా దులీప్ ట్రోఫీ రెండో రౌండ్కు ఎంపిక చేస్తారనే నమ్మకంతో ఉన్నా’ అని చెప్పాడు.
Also Read
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
- Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
- 48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- India Independence Day 1947: స్వాతంత్య్రపు తొలి ఉదయం.. ఢిల్లీ చూసిన ఆ అపూర్వ దృశ్యం
Also Read: Kolkata Doctor Rape-Murder: సీఎం మమతా బెనర్జీకి బెదిరింపులు.. విద్యార్థి అరెస్టు!
2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున రింకు సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 14 మ్యాచ్ల్లో 474 పరుగులు చేశాడు. ఆ ప్రదర్శనతో 2023 ఆగస్టులో ఐర్లాండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కొద్దికాలంలోనే టీమిండియా టీ20 మిడిల్ ఆర్డర్లో సెటిల్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2024లో స్థానం ఖాయం అనుకున్నా.. రిజర్వ్ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
తాజావార్తలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Royal Enfield Continental GT 650: రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 రిలీజ్.. USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!