Rinku Singh: రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్.. జూన్ 8న నిశ్చితార్థం
- రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్
- జూన్ 8న నిశ్చితార్థం
భారత క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పే టైమ్ దగ్గరపడుతోంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ ఖరారైంది. నవంబర్ 18న ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఇద్దరి ఉంగరోత్సవ వేడుక లక్నోలోని ఒక హోటల్లో జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రింకూకి కాబోయే భార్య సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్. 26 ఏళ్ల సరోజ్ 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై మచ్లిషహర్ నుంచి గెలుపొందారు. ఆమె బిపి సరోజ్ను 35850 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రియా సరోజ్ 1998 నవంబర్ 23న వారణాసిలో జన్మించారు.
Also Read:Yuzvendra Chahal: ముంబైకి చుక్కలే.. వచ్చేస్తున్న స్పిన్ మాంత్రికుడు..?
Also Read
- Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
- MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
- Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
ప్రియా తన పాఠశాల విద్యను న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తి చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్లో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా పొందింది. ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. తూఫానీ సరోజ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ టికెట్పై కెరాకట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రియా సరోజ్ భారతదేశంలో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీ. ప్రియా లోక్సభకు ఎన్నికైనప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు, 6 నెలలు, 12 రోజులు.
Also Read:WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
రింకు సింగ్ 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించారు. అతని తండ్రి సిలిండర్ డెలివరీ పని చేసేవాడు. అతని సోదరుడు ఆటో రిక్షా నడుపుతూ ఉండేవాడు. రింకుకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. రింకు కేవలం పాఠశాల విద్య మాత్రమే అభ్యసించాడు. అతను 9వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, ఆ తర్వాత అతను ఎక్కువ చదువుకోలేదు. ఉత్తరప్రదేశ్ అండర్-16 నుంచి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2017లో ఐపీఎల్లో భాగమయ్యాడు. 2018లో, షారుఖ్ ఖాన్ KKR అతన్ని రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఒకే మ్యాచ్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన తర్వాత రింకుకు గుర్తింపు వచ్చింది. రింకు 18 ఆగస్టు 2023న డబ్లిన్లో భారత్ తరపున తన T20I అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు రింకు 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను 2 వన్డే మ్యాచ్ల్లో 55 పరుగులు, ఇప్పటివరకు 33 టీ20 మ్యాచ్లు ఆడి 546 పరుగులు చేశాడు
తాజావార్తలు
-
Iran Prince Reza Pahlavi: ఇరాన్ బహిష్కృత నేత రెజా పహ్లవిపై దాడి.. వీడియో వైరల్
-
MI vs CSK: వాంఖెడేలో తిలక్ వర్మ – జేమీ ఓవర్టన్ మధ్య మాటల యుద్ధం.. వీడియో వైరల్.!
-
Friday Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.!
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!