Rinku Singh: రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్.. జూన్ 8న నిశ్చితార్థం
- రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్
- జూన్ 8న నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పే టైమ్ దగ్గరపడుతోంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ ఖరారైంది. నవంబర్ 18న ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఇద్దరి ఉంగరోత్సవ వేడుక లక్నోలోని ఒక హోటల్లో జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రింకూకి కాబోయే భార్య సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్. 26 ఏళ్ల సరోజ్ 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై మచ్లిషహర్ నుంచి గెలుపొందారు. ఆమె బిపి సరోజ్ను 35850 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రియా సరోజ్ 1998 నవంబర్ 23న వారణాసిలో జన్మించారు.
Also Read:Yuzvendra Chahal: ముంబైకి చుక్కలే.. వచ్చేస్తున్న స్పిన్ మాంత్రికుడు..?
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ప్రియా తన పాఠశాల విద్యను న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తి చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్లో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా పొందింది. ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. తూఫానీ సరోజ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ టికెట్పై కెరాకట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రియా సరోజ్ భారతదేశంలో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీ. ప్రియా లోక్సభకు ఎన్నికైనప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు, 6 నెలలు, 12 రోజులు.
Also Read:WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
రింకు సింగ్ 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించారు. అతని తండ్రి సిలిండర్ డెలివరీ పని చేసేవాడు. అతని సోదరుడు ఆటో రిక్షా నడుపుతూ ఉండేవాడు. రింకుకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. రింకు కేవలం పాఠశాల విద్య మాత్రమే అభ్యసించాడు. అతను 9వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, ఆ తర్వాత అతను ఎక్కువ చదువుకోలేదు. ఉత్తరప్రదేశ్ అండర్-16 నుంచి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2017లో ఐపీఎల్లో భాగమయ్యాడు. 2018లో, షారుఖ్ ఖాన్ KKR అతన్ని రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఒకే మ్యాచ్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన తర్వాత రింకుకు గుర్తింపు వచ్చింది. రింకు 18 ఆగస్టు 2023న డబ్లిన్లో భారత్ తరపున తన T20I అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు రింకు 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను 2 వన్డే మ్యాచ్ల్లో 55 పరుగులు, ఇప్పటివరకు 33 టీ20 మ్యాచ్లు ఆడి 546 పరుగులు చేశాడు
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!