Rinku Singh: రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్.. జూన్ 8న నిశ్చితార్థం
- రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్
- జూన్ 8న నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పే టైమ్ దగ్గరపడుతోంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ ఖరారైంది. నవంబర్ 18న ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఇద్దరి ఉంగరోత్సవ వేడుక లక్నోలోని ఒక హోటల్లో జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రింకూకి కాబోయే భార్య సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్. 26 ఏళ్ల సరోజ్ 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై మచ్లిషహర్ నుంచి గెలుపొందారు. ఆమె బిపి సరోజ్ను 35850 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రియా సరోజ్ 1998 నవంబర్ 23న వారణాసిలో జన్మించారు.
Also Read:Yuzvendra Chahal: ముంబైకి చుక్కలే.. వచ్చేస్తున్న స్పిన్ మాంత్రికుడు..?
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రియా తన పాఠశాల విద్యను న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తి చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్లో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా పొందింది. ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. తూఫానీ సరోజ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ టికెట్పై కెరాకట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రియా సరోజ్ భారతదేశంలో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీ. ప్రియా లోక్సభకు ఎన్నికైనప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు, 6 నెలలు, 12 రోజులు.
Also Read:WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
రింకు సింగ్ 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించారు. అతని తండ్రి సిలిండర్ డెలివరీ పని చేసేవాడు. అతని సోదరుడు ఆటో రిక్షా నడుపుతూ ఉండేవాడు. రింకుకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. రింకు కేవలం పాఠశాల విద్య మాత్రమే అభ్యసించాడు. అతను 9వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, ఆ తర్వాత అతను ఎక్కువ చదువుకోలేదు. ఉత్తరప్రదేశ్ అండర్-16 నుంచి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2017లో ఐపీఎల్లో భాగమయ్యాడు. 2018లో, షారుఖ్ ఖాన్ KKR అతన్ని రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఒకే మ్యాచ్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన తర్వాత రింకుకు గుర్తింపు వచ్చింది. రింకు 18 ఆగస్టు 2023న డబ్లిన్లో భారత్ తరపున తన T20I అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు రింకు 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను 2 వన్డే మ్యాచ్ల్లో 55 పరుగులు, ఇప్పటివరకు 33 టీ20 మ్యాచ్లు ఆడి 546 పరుగులు చేశాడు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..