Rinku Singh: రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్.. జూన్ 8న నిశ్చితార్థం
- రింకు సింగ్ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఫిక్స్
- జూన్ 8న నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెటర్ రింకూ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పే టైమ్ దగ్గరపడుతోంది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, క్రికెటర్ రింకు సింగ్ వివాహ తేదీ ఖరారైంది. నవంబర్ 18న ఇద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. జూన్ 8న నిశ్చితార్థం జరగనుంది. ఇద్దరి ఉంగరోత్సవ వేడుక లక్నోలోని ఒక హోటల్లో జరుగుతుంది. ఈ ఏడాది జనవరిలో, క్రికెటర్ రింకు సింగ్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీతో పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. రింకూకి కాబోయే భార్య సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్. 26 ఏళ్ల సరోజ్ 2024 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ టికెట్పై మచ్లిషహర్ నుంచి గెలుపొందారు. ఆమె బిపి సరోజ్ను 35850 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రియా సరోజ్ 1998 నవంబర్ 23న వారణాసిలో జన్మించారు.
Also Read:Yuzvendra Chahal: ముంబైకి చుక్కలే.. వచ్చేస్తున్న స్పిన్ మాంత్రికుడు..?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ప్రియా తన పాఠశాల విద్యను న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తి చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్లో పట్టభద్రురాలైంది. ఆ తర్వాత నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి పట్టా పొందింది. ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. తూఫానీ సరోజ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ టికెట్పై కెరాకట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రియా సరోజ్ భారతదేశంలో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీ. ప్రియా లోక్సభకు ఎన్నికైనప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు, 6 నెలలు, 12 రోజులు.
Also Read:WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్.. లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి
రింకు సింగ్ 1997 అక్టోబర్ 12న ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో జన్మించారు. అతని తండ్రి సిలిండర్ డెలివరీ పని చేసేవాడు. అతని సోదరుడు ఆటో రిక్షా నడుపుతూ ఉండేవాడు. రింకుకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. రింకు కేవలం పాఠశాల విద్య మాత్రమే అభ్యసించాడు. అతను 9వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, ఆ తర్వాత అతను ఎక్కువ చదువుకోలేదు. ఉత్తరప్రదేశ్ అండర్-16 నుంచి రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2017లో ఐపీఎల్లో భాగమయ్యాడు. 2018లో, షారుఖ్ ఖాన్ KKR అతన్ని రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఒకే మ్యాచ్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన తర్వాత రింకుకు గుర్తింపు వచ్చింది. రింకు 18 ఆగస్టు 2023న డబ్లిన్లో భారత్ తరపున తన T20I అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు రింకు 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అతను 2 వన్డే మ్యాచ్ల్లో 55 పరుగులు, ఇప్పటివరకు 33 టీ20 మ్యాచ్లు ఆడి 546 పరుగులు చేశాడు
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!