ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల పై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు.
Read Also: Cabinet Sub-Committee: గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు..
తాజాగా.. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ క్రమంలో.. సోనియా గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రైతు రుణమాఫీ – వరంగల్ సభ అంశాలపై రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ, క్యాబినెట్ విస్తరణ పై కూడా చర్చలు జరుగుతున్నాయి.
Read Also: Padma Shri Awardees: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 వేల పింఛన్.. జీవో జారీ
ఇదిలా ఉంటే.. ఇంతకుముందు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి తెలిపారు. అంతేకాకుండా.. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు.. గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి కోరారు.