Site icon NTV Telugu

CM Revanth Reddy: కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారు.. మరి ఏమైంది?

Cm Revanth Reddy Speech

Cm Revanth Reddy Speech

CM Revanth Reddy: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని తాము మాత్రమే కాదు.. దేశ ప్రధాని, హోమ్ శాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్, హరీష్ రావును 48 గంటల్లో జైల్లో పెడతామన్నారని.. వీళ్ళ మాటలు నమ్మి తాము కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించామన్నారు. 48 గంటలు కాదు.. ఎన్ని నెలలు గడిచిందో చూశారన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. ఒక్కటై పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు సీట్లు పంచుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్‌ను జైల్లో పెట్టిన తరువాత బీజేపీ నేతలు సూచనలు చేస్తే బాగుంటుందన్నారు.

READ MORE: Red Sky Australia: ఆస్ట్రేలియాలో భయానక దృశ్యం.. రక్తవర్ణంలోకి మారిన ఆకాశం(వీడియో)

“నేను నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తున్నా.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే.. దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.. హరీష్ రావు నిజాయితీపరుడని కేటీఆర్, వెంకటరమణా రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోండి.” అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

READ MORE: RCB vs SRH: చిన్నస్వామిలో చరిత్ర.. ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌కు రికార్డు వ్యూస్!

Exit mobile version