Revanth Reddy : ఆయన కుటుంబ పంచాయతీ కోసమే బీఆర్ఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడంగల్లో వందలాది మంది పోలీసులను పెట్టి నన్ను ఓడగొట్టారని, కాంగ్రెస్ కార్యకర్తలే లేని మల్కాజిగిరిలో గెలిపించారన్నారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్కి నేను ఇప్పుడు మొగుడు అయ్యే పరిస్థితి వచ్చిందని, బీఆర్స్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ పంచాయతీ కోసమే బీఆర్ఎస్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీహార్ అధికారులతోనే నడిపిస్తున్నడని, కేటీఆర్ కి తెలంగాణ కవితకి ఆంధ్రప్రదేశ్ మరి హరీష్ కి ఏమి ఇస్తాడు చూడాలి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్కి ఎన్నికల కమిషన్ దగ్గర పత్రం కూడా పెట్టలేదని ఆయన అన్నారు. గత సంవత్సరం కేసీఆర్ కి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి స్థలం ఇచ్చినప్పటి నుండే ఈ ఆట సాగిందని ఆయన అన్నారు. అప్పటి నుండి ఆయన వాళ్ళని కలిసి వస్తున్నాడని, కాంగ్రెస్ని బలహీనం చేయాలని కేసీఆర్, మోడీ కుట్ర పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ చేపట్టిన ప్రతి చర్య నరేంద్ర మోదీ బలోపేతం చేయడానికేనని, బీజేపీ వ్యతిరేక శక్తులను బలహీనం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని ఆయన అన్నారు.
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
బీజేపీని బలహీనం చేయాలంటే బీజేపీని వ్యతిరేకించే శక్తులను కూడగట్టాలని, యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శించారు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్ను ఎందుకు కలుపుకోవడంలేదని, కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికే అని ఆయన అన్నారు. కేసీఆర్ మోదీని ఓడించాలనుకుంటే… బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలని, కేసీఆర్ చర్యలన్నీ మోదీ సూచనలతో జరుగుతున్నవే అని ఆయన అన్నారు. అందుకే ఆయనపై మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలేదని, ఈఎస్ఐ కుంభకోణంపై ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ను బలహీన పరచేందుకే కేసీఆర్, మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
-
Yashasvi Jaiswal-ICC: శ్రీలంక పేసర్తో గొడవ.. యశస్వి జైస్వాల్కు ఐసీసీ బిగ్ షాక్!
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!