Revanth Reddy : గుజరాత్కు వేల కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణను ఎందుకు పట్టించుకోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC President Revanth Reddy Criticized BJP and TRS Governments.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అధిక వర్షాలు వరదలుగా మారిందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ప్రకృతి వైపరీత్యం బీభత్సం సృష్టించిందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలని ఆయన తెలిపారు. నష్టంపై నివేదికలు తయారు చేయాలని, సీఎం కేసీఆర్ రాజకీయ కారణాలతో స్వార్ధం కోసం ప్రజా సమస్యలు గాలికి వదిలేశారన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు మాకు సమాచారం అందిందన్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం 1400 ల కోట్ల నష్టం అంటూ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఢిల్లీకి వచ్చి మూడు రోజులు అయిందని, ప్రధానిపై ఒత్తిడి తెచ్చి నిధులు తెస్తారు అనుకున్నామని, ఢిల్లీలో స్వంత పార్టీ ఎంపిలకే టైమ్ ఇవ్వటం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీలో మూడు రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారని, ప్రధానితో పాటూ, కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి ఇప్పటికీ అపాయింట్మెంట్ అడగలేదని ఆయన ధ్వజమెత్తారు.
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
మోడీ గుజరాత్కే ప్రధాని నా.. గుజరాత్ లో వరదలు వస్తే, వేల కోట్లు ఇస్తారు.. తెలంగాణ ను కేంద్రం ఎందుకు పట్టించుకోదు అంటూ ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని, కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, కేసీఆర్ ఎందుకు ఇళ్లు వదలడం లేదని, ప్రధానిని ప్రశ్నించడానికి సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు మిగతా పక్షాల వెనుక దాక్కుని పోరాటం అని చెప్తున్నారని, ఎంపీలు ఫోటోలకు ఫోజులిస్తున్నారని, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు తెలంగాణను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలుద్దాం అంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని, ప్రధానిపై కేసీఆర్ పోరాట కార్యాచరణను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అపుడే ఢిల్లీ నుంచి కదలాలని, లేదంటే మీ అవినీతిని ప్రశ్నిస్తారనే ప్రధానిపై మాట్లాడటం లేదని తెలంగాణ సమాజం భావిస్తోందన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!