Revanth Reddy: భట్టి పాదయాత్ర పార్టీ కోసం చేసింది కాదు.. తెలంగాణ సమాజం కోసం
Revanth meets Bhatti: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తల్లెంపాడులో భేటీ అయ్యారు. అయితే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత రేవంత్ రెడ్డి భట్టి పాదయాత్రలో కలవడం ఇదే మొదటిసారి. జులై 2న జరగబోయే తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం గురించి చర్చించారు. మరోవైపు సమావేశం అనంతరం జనగర్జన సభ నిర్వహించే ప్రదేశాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించనున్నారు. అందుకోసం రేవంత్ రెడ్డి, మధుయాష్కీ సభా స్థలికి వెళ్లారు.
Read Also: Mega Princess: పిక్ ఆఫ్ ది డే.. వారసురాలిని చూసి మురిసిపోతున్న మెగా కుటుంబం
Also Read
ఆదిలాబాద్ జిల్లా నుండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ఈ యాత్ర జూలై రెండో తేదీన ముగియనుంది. దీని సందర్భంగా ఖమ్మంలో జన గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారీగా జన సమీకరణ చేయనుంది. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరనున్నారు. అయితే జన గర్జన సభ విజయవంతం చేసేందుకుగాను అవలంభించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి చర్చించారు.
Read Also: Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు
అంతకుముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కోసం చేసింది కాదని.. తెలంగాణ సమాజం కోసం చేసిందని అన్నారు. అభివృద్ధి పేరుతో కేసీఆర్ ఈస్ట్ మన్ కలర్ లో చూపిస్తున్న భ్రమల్ని ఈ పాదయాత్ర పటాపంచలు చేసిందని తెలిపారు. భట్టి విక్రమార్క ఊరూరు తిరుగుతూ అక్కడ జరుగుతున్న తప్పిదాలను, నష్టాలను, కేసీఆర్ చేతిలో మోసపోయిన బాధితులను భట్టి విక్రమార్క కలిసి.. వారికి భరోసా కల్పించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
-
Tamil Nadu: విజయ్తో టచ్లోకి అన్నాడీఎంకే..
-
End of Left Rule: దేశ రాజకీయాల్లో ఒక శకం ముగింపు.. కనుమరుగవనున్న ఎర్రజెండా?
-
Ashu Reddy: అంతా ఆయన ఇష్టపూర్వకంగా ఖర్చు చేసిందే.. హైకోర్టులో అషు రెడ్డి సంచలనం!
-
MI Captain Hardik: వరుస వైఫల్యాలతో సతమతం.. ముంబై ఇండియన్స్ను వీడనున్న హార్దిక్ పాండ్యా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!