Deputy CM Pawan Kalyan: చారిత్రాత్మక ఒప్పందానికి ఏపీ వేదిక అయింది.. కాకినాడని ఎంచుకోవడం సంతోషం..
- గ్రీన్ ఎనర్జీకి ఏపీ ఉత్పత్తి స్థానం కావాలి..
- చారిత్రాత్మక ఒప్పందానికి ఏపీ వేదిక అయింది..
- దేశంలో కాకినాడని ఎంచుకోవడం సంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కాకినాడ వేదికగా జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కొత్త దిశ చూపుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలోనే కాకినాడను ఈ కీలక ప్రాజెక్టు కోసం ఎంపిక చేయడం ఎంతో ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత.. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. ఆ పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి భయపడ్డారని చెప్పారు.
Read Also: TDP vs Jana Sena Clash: టీడీపీ వర్సెస్ జనసేన.. కొట్టుకున్న నేతలు..!
Also Read
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ఇప్పుడా పరిస్థితి మారిందని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మారాలని తాము కృషి చేస్తున్నామని తెలిపార పవన్ కల్యాణ్.. చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం గర్వకారణమని, ముఖ్యంగా కాకినాడను ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. రాజకీయ పార్టీలు మారవచ్చని, కానీ ప్రభుత్వం శాశ్వతమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 14 సంవత్సరాల క్రితం అనిల్ తపనతో గ్రీన్కో కంపెనీని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. తాను పుట్టి పెరిగిన కాకినాడ కోసం అనిల్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతి వ్యక్తి పెద్ద కలలు కనాలని, ఆ కలలే అభివృద్ధికి పునాది అవుతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇది కాకినాడతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారనుందని తెలిపారు. ఇక, భవిష్యత్తులో కాకినాడకు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ.. ముందకు సాగుతుందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!