Deputy CM Pawan Kalyan: చారిత్రాత్మక ఒప్పందానికి ఏపీ వేదిక అయింది.. కాకినాడని ఎంచుకోవడం సంతోషం..
- గ్రీన్ ఎనర్జీకి ఏపీ ఉత్పత్తి స్థానం కావాలి..
- చారిత్రాత్మక ఒప్పందానికి ఏపీ వేదిక అయింది..
- దేశంలో కాకినాడని ఎంచుకోవడం సంతోషం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కాకినాడ వేదికగా జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కొత్త దిశ చూపుతోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలోనే కాకినాడను ఈ కీలక ప్రాజెక్టు కోసం ఎంపిక చేయడం ఎంతో ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేయనున్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత.. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొన్న ఇబ్బందులు అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. ఆ పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి భయపడ్డారని చెప్పారు.
Read Also: TDP vs Jana Sena Clash: టీడీపీ వర్సెస్ జనసేన.. కొట్టుకున్న నేతలు..!
Also Read
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
ఇప్పుడా పరిస్థితి మారిందని, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీకి ఏపీ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా మారాలని తాము కృషి చేస్తున్నామని తెలిపార పవన్ కల్యాణ్.. చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం గర్వకారణమని, ముఖ్యంగా కాకినాడను ఎంపిక చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. రాజకీయ పార్టీలు మారవచ్చని, కానీ ప్రభుత్వం శాశ్వతమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సుమారు 14 సంవత్సరాల క్రితం అనిల్ తపనతో గ్రీన్కో కంపెనీని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. తాను పుట్టి పెరిగిన కాకినాడ కోసం అనిల్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతి వ్యక్తి పెద్ద కలలు కనాలని, ఆ కలలే అభివృద్ధికి పునాది అవుతాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇది కాకినాడతో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారనుందని తెలిపారు. ఇక, భవిష్యత్తులో కాకినాడకు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు.. కూటమి ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ.. ముందకు సాగుతుందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!