Tirupati New Year Restrictions: తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెంపుల్ సిటీ న్యూ ఇయర్ జోష్ తో ఉంది. తిరుపతిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. యువత రెచ్చిపోతే ఇబ్బందులు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సాయంత్రం నుండి తిరుపతిలోని ఫ్లై ఓవర్స్ మూసివేయనున్నారు. అర్థరాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సూచించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో బ్రీత్ అనలైజెర్ టెస్ట్ లు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు మందు తాగి పట్టుబడితే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
Read Also: DGP Mahender Reddy Retirement Parade Live: డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ పరేడ్
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
కాలేజ్ యాజమాన్యాలకు మందు తాగిన విద్యార్థుల లిస్ట్ పంపుతాం అన్నారు. బైక్ , కార్ రేసింగ్ లకు పాల్పడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ. ప్రభుత్వ నిబంధనల మేరకు వైన్ షాప్స్, బార్ లు మూసివేయాలని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశించారు. బైక్ లపై విచ్చలవిడిగా తిరిగితే కఠినచర్యలు వుంటాయన్నారు. విజయవాడ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది పోలీస్ శాఖ. ఈ మేరకు వేడుకలకు సంబంధించి ఆంక్షల గురించి నగర సీపీ కాంతిరానా టాటా ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, కేకులు కట్ చేస్తూ హడావిడి చేయడం లాంటి చర్యలు కుదరవని హెచ్చరించారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటించాలన్నారు.

విజయవాడలో బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలు పాటించాలి. నిర్దేశించిన సమయానికి మించి తెరవకూడదు. అలాగే డీజేలకు అనుమతి తీసుకోవాలని నగర సీపీ తెలిపారు. ఈవెంట్స్ ఆర్గనైజర్లు, క్లబ్ లు, పబ్ ల నిర్వాహకులు పోలీసు అనుమతి తీసుకోవాలని, అర్ధరాత్రి 12 గంటల వరకు వేడుకలు నిర్వహించాల్పి వుంటుంది. ప్రజలు వేడుకల్లో పాల్గొన్నా నిబంధనలు పాటించాలి. రాత్రి ఒంటిగంటకల్లా ఇళ్లకు చేరుకోవాలని ముందస్తు సూచన చేశారు. విజయవాడలో ఫ్లై ఓవర్లు మూసేస్తామని, రాత్రిళ్లు రోడ్లపై తిరగడం కుదరదని ప్రజలకు సూచించారు. విజయవాడలో 31 రాత్రి తర్వాత.. 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో ఉంటుంది.
Read Also: Tamil Nadu: తమిళనాడులో బాంబు పేలుడు.. నలుగురు మృతి
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..