Resonance : జేఈఈ మెయిన్లో ‘రెసోనెన్స్’ విజయ దుందుభి
- జేఈఈ మెయిన్లో 'రెసోనెన్స్' చారిత్రాత్మక విజయం
- విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సత్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Resonance : ఆల్ ఇండియా జేఈఈ మెయిన్ 2025లో హైదరాబాద్లోని ‘రెసోనెన్స్’ జూనియర్ కళాశాలల విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారు. మాదాపూర్ లో గల రెసోనెన్స్ స్కూల్ విజ్డమ్ క్యాంపస్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను రెసోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో అద్భుత విజయం సాధించడం రెసోనెన్స్ ప్రతిభ మరోసారి నిరూపితమైందన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, ఇతర మెడికల్ ప్రవేశ పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంకులు సాధించడంలో ముందంజలో ఉన్నామన్నారు. రెసోనెన్స్ విద్యార్థి అర్చిస్మాన్ 295/300 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. హైదరాబాద్ రెసోనెన్స్ జూనియర్ కళాశాలలకు చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 100 పర్సెంటైల్ సాధించారన్నారు. 57 మంది విద్యార్థులు 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా వచ్చాయన్నారు.

Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
రెసోనెన్స్ హైదరాబాద్ విద్యార్థులు ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా అసాధారణ విజయాలు సాధించారన్నారు. హైదరాబాద్లోని అన్ని క్యాంపస్ల నుంచి 1500 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందారన్నారు. అందులో 57 మంది విద్యార్థులు 99 శాతం పైగా సాధించారని చెప్పడం గర్వంగా ఉందన్నారు. ఇది మా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషికి నిదర్శనమన్నారు. టాప్ 4 విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందన్నారు. హైదరాబాద్ క్యాంపస్ల నుంచి పల్లా శివ సంకేత్ రెడ్డి, పీ వెన్నెల, పీ దివిత్ రెడ్డి వివిధ సబ్జెక్టుల్లో 100 పర్సెంటైల్ సాధించారన్నారు.

జేఈఈ మెయిన్ 2025లో 99.31 శాతం పైగా ఎన్టీఏ స్కోరు సాధించిన హైదరాబాద్ విద్యార్థులు వీరు.. వేదాంత్ సక్సేనా (99.9492), నాగంవార్ హరితేజ్ (99.9226), సురవరం ప్రణయ్ రెడ్డి (99.9067), పల్లా శివ సంకేత్ రెడ్డి (99.8799), పీ వెన్నెల (99.7884), అవనీష్ నితిన్ కాబ్రా (99.7120), పీ దివిత్ రెడ్డి (99.6929), బింగి శ్రీహర్ష (99.6900), గాండ్ల అనిరుధ్ (99.6435), ఎండీ రిఫా ఉర్ రెహమాన్ (99.5851), సిద్ధార్థ రాఘవ (99.5659), క్షితిజ్ జైన్ (99.5611), పోలనాటి అనిష్ (99.5500), ప్రణయ్ వెంకటేష్ (99.5179), వీ శశి కౌశిక్ (99.4890), బీ తన్మయ్ కార్తీక్ (99.4446), ప్రాథా అకిరి (99.3631), తవనం శ్రీవిద్య (99.3525), హర్షిత రాంగోజు (99.3357), ఎస్ రెథేష్ (99.3150).

రెసొనెన్స్ గురించి
దేశవ్యాప్తంగా జేఈఈ, ఎన్ఐటీ, నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే రెసోనెన్స్ 2001వ సంవత్సరంలో ఐఐటీ మద్రాస్కు చెందిన ఆర్కే వర్మ స్థాపించారు. దీని ప్రయాణం రాజస్థాన్లోని కోటాలో ప్రారంభమైంది. రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించింది. రెసోనెన్స్ ప్రస్తుతం 87 నగరాల్లో 150 పైగా కేంద్రాలతో కలదు. ఇప్పటివరకు తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది . 3,25,000 పైగా విద్యార్థులను ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దింది. ఈ అద్భుత విజయాలతో 2018లో హైదరాబాద్లో ప్రవేశించింది. పూర్ణచంద్ర రావు ఆధ్వర్యంలో ప్రారంభమైన రెసోనెన్స్ హైదరాబాద్ కేంద్రాలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రతి ఏడాది 80 శాతానికి పైగా విద్యార్థులు విజయవంతంగా అర్హత సాధిస్తూ.. హైదరాబాద్ విద్యా రంగంలో రెసోనెన్స్ ఒక విశ్వసనీయ బ్రాండ్గా నిలిచింది.
మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి: 9959154371 / 9963980259

తాజావార్తలు
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!