Terror Threats: షాకింగ్.. రిపబ్లిక్ డే రోజు భారత్పై భారీ ఉగ్రదాడికి ప్లాన్! కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day Security Alert: రిపబ్లిక్ డే దగ్గర పడుతున్న వేళ దేశ భద్రతపై ఇంటెలిజెన్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. జనవరి 26న ఢిల్లీలో ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని గూఢచార వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాదులు ఈ దాడులకు పథకం వేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ మార్గంగా భారత్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. వీరి వద్ద పేలుడు పదార్థాలు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. అధికారులు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశంలో ఉన్న బంగ్లాదేశ్ పౌరుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ అంశంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది.
READ MORE: MS Dhoni: ఎవరు గెలిచినా నా జట్టు సీఎస్కేనే.. ఆర్సీబీ ఐపీఎల్ తొలి ట్రోఫీపై ధోనీ కామెంట్స్ వైరల్
Also Read
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
- Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
ఇదే సమయంలో గురపత్వంత్ సింగ్ పన్నున్ నేతృత్వంలోని ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే సంస్థ కూడా రిపబ్లిక్ డే సమయంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న తమ రహస్య అనుచరులను సంప్రదించినట్లు సమాచారం. ఈ గుంపులు నల్ల జెండాలు ప్రదర్శించడం, ఖలిస్థాన్కు మద్దతుగా పోస్టర్లు అంటించడం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విరగ్గొట్టడం వంటి చర్యలతో రిపబ్లిక్ డే వేడుకలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పంజాబ్లో రైల్వే పట్టాలపై దాడులు చేసే ప్రయత్నం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
READ MORE: Anil Ravipudi: నా తొమ్మిది సినిమాల్లో ఆ మూవీ సీక్వెల్ చేయాలని ఉంది..
ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. ఢిల్లీలో పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖాలను వెంటనే గుర్తించేలా ఏఐ స్మార్ట్ గ్లాసులను పోలీసులు వినియోగిస్తున్నారు. ఇవి జనసమూహాల్లో అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించడంలో సహాయపడతాయి. జమ్మూ కశ్మీర్లో కూడా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడి డీజీపీ నలిన్ ప్రభాత్ అధికారులతో సమావేశమై, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా
-
Bhatti Vikramarka : సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అణచివేస్తాం
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
-
Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!