టాలీవుడ్లో పెద్ద సినిమాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. ఇది నిజంగా హెల్తీ ట్రెండా? లేక కలెక్షన్స్ గేమా.. స్టార్ హీరోలు క్లాష్ అవాయిడ్ చేస్తున్నారా.. లేక తమ మార్కెట్ని సేఫ్ చేసుకోవడానికే వాయిదాలు వేస్తున్నారా అన్నది పక్కన పెడితే టాలీవుడ్ లో పోస్ట్ పోన్ ట్రెండ్ గాట్టిగా నడుస్తోంది. మొదటగా పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19, 2026న గ్రాండ్గా రిలీజ్ అవుతుండటంతో అదే సమయంలో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ మూవీ కూడా మొదట మార్చి 27న రావాల్సి ఉండగా, ఏప్రిల్ 30కి పోస్ట్పోన్ చేశారు. మేకర్స్ ఈ డేట్ని మే 1 వరకు హాలిడేతో క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుకున్నారు.
Also Read : Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!
ఇక లేటెస్ట్ గా అఖిల్ అక్కినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘లెనిన్’. అబ్బూరి మురళికిషోర్ తెరకెక్కించిన ఈ మూవీ మొదట మే 1న రిలీజ్గా ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో రామ్ చరణ్ సినిమా ‘పెద్ది’ ఉండటంతో పోటీ పడకుండా జూన్ 26కి వాయిదా వేసుకున్నారు. మెగా, అక్కినేని ఫ్యామిలీల మధ్య ఉన్న మంచి రిలేషన్ కూడా ఈ నిర్ణయానికి కారణమని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇది కేవలం అనుబంధం మాత్రమే కాదు… క్లియర్ బిజినెస్ స్ట్రాటజీ కూడా. ఒకేసారి పెద్ద సినిమాలు వస్తే థియేటర్స్, కలెక్షన్స్ డివైడ్ అవుతాయి. కానీ ఇలా వాయిదాలు వేసుకుంటే ప్రతి సినిమాకి సోలో రన్ దొరుకుతుంది. జూన్ 26న ‘లెనిన్’కి పెద్దగా పోటీ లేకపోవడంతో అఖిల్కు ఇది సాలిడ్ కంబ్యాక్ ఛాన్స్గా మారొచ్చు అని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. మొత్తానికి ఇది “హెల్తీ క్లాష్”నా? లేక “సేఫ్ గేమ్ ప్లానా? ఏది ఏమైనా స్టార్ హీరోలు ఇండస్ట్రీ కోసం ఆలోచిస్లున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ తమ సినిమా లాస్ కాకూడాదని ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ టాలీవుడ్ భవిష్యత్తును ఎలా మార్చబోతుందో చూడాలి.
