TG Congress: కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతల రియాక్షన్..
- కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతల రియాక్షన్
- కేటీఆర్కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడింది- ఆది శ్రీనివాస్
- ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..?- ఆది శ్రీనివాస్
- లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారు- అద్దంకి దయాకర్
- అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి- అద్దంకి దయాకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..? అని దుయ్యబట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారు.. తాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా తలుపులు విరగొట్టి అరెస్టు చేయడం లేదని అన్నారు. కేటీఆర్ ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు.. కేటీఆర్ చేస్తున్న దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ తెలిపారు.
Read Also: Stock Market: వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
- Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
- Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
- Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలతో కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు.. అధికారులు, ఎమ్మెల్యేలు అందరిపైనా దాడులు చేసేది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. దాడుల సంస్కృతిని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది.. కేటీఆర్ సహా అవినీతి చేసిన వాళ్లంతా ఉండాల్సింది జైల్లో అని పేర్కొన్నారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట రకరకాల మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి.. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు. ప్రశ్నిస్తే అరెస్టులా అంటున్న బీఆర్ఎస్ నేతలు.. 10 ఏళ్లలో చేసింది ఏమిటి అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కోదండ రామ్, మందకృష్ణ మాదిగ, విమలక్క సహా ప్రజాస్వామ్యక వాదులు, ప్రతిపక్ష నేతలు మీద బీఆర్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ప్రజలే దాడులు చేసే సంస్కృతిని బీఆర్ఎస్ నేతలు తెచ్చుకోవద్దని అద్దంకి దయాకర్ సూచించారు.
Read Also: PPF Scheme: బెస్ట్ పెట్టుబడి స్కీమ్.. రోజుకు రూ. 50 పొదుపు చేస్తే చాలు.. చేతికి రూ. 5 లక్షలు
తాజావార్తలు
-
Passport Row: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!