TG Congress: కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతల రియాక్షన్..
- కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతల రియాక్షన్
- కేటీఆర్కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడింది- ఆది శ్రీనివాస్
- ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..?- ఆది శ్రీనివాస్
- లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారు- అద్దంకి దయాకర్
- అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి- అద్దంకి దయాకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేటీఆర్ అంశంలో సుప్రీం తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్కి ఒకవైపు గోడ దెబ్బ, ఇంకో వైపు చెంప దెబ్బ పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకొని కుంభకోణం లంభకోణం లేదని అంటావా..? అని దుయ్యబట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారు.. తాము బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా తలుపులు విరగొట్టి అరెస్టు చేయడం లేదని అన్నారు. కేటీఆర్ ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తారు.. కేటీఆర్ చేస్తున్న దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ తెలిపారు.
Read Also: Stock Market: వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రౌడీలతో కేటీఆర్ రాజకీయం చేస్తున్నారు.. అధికారులు, ఎమ్మెల్యేలు అందరిపైనా దాడులు చేసేది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. దాడుల సంస్కృతిని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది.. కేటీఆర్ సహా అవినీతి చేసిన వాళ్లంతా ఉండాల్సింది జైల్లో అని పేర్కొన్నారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట రకరకాల మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అన్ని దొంగతనాలు ప్రజలకు తెలుస్తాయి.. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపారు. ప్రశ్నిస్తే అరెస్టులా అంటున్న బీఆర్ఎస్ నేతలు.. 10 ఏళ్లలో చేసింది ఏమిటి అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కోదండ రామ్, మందకృష్ణ మాదిగ, విమలక్క సహా ప్రజాస్వామ్యక వాదులు, ప్రతిపక్ష నేతలు మీద బీఆర్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. ప్రజలే దాడులు చేసే సంస్కృతిని బీఆర్ఎస్ నేతలు తెచ్చుకోవద్దని అద్దంకి దయాకర్ సూచించారు.
Read Also: PPF Scheme: బెస్ట్ పెట్టుబడి స్కీమ్.. రోజుకు రూ. 50 పొదుపు చేస్తే చాలు.. చేతికి రూ. 5 లక్షలు
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..