IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ తిరిగొచ్చేశారు!
- ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతున్న వేళ ఆర్సీబీకి గుడ్ న్యూస్
- ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ తిరిగొచ్చేశారు
- లీగ్ దశ అనంతరం ఇంగ్లాండ్కు జేకబ్ బెథెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీకి గుడ్ న్యూస్. ఏకంగా ఆరుగురు విదేశీ మ్యాచ్ విన్నర్స్ ఐపీఎల్ 2025లో ఆడనున్నారు. రొమారియో షెపర్డ్, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్, జోష్ హేజిల్వుడ్, లుంగి ఎంగిడిలు మిగతా ఐపీఎల్ మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నారు. ఇక జేకబ్ బెథెల్ మాత్రమే ఐపీఎల్ లీగ్ దశ అనంతరం ఇంగ్లాండ్కు వెళ్లనున్నాడు. విషయం తెలిసిన ఆర్సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి స్టార్ పేసర్ జోష్ హేజిల్వుడ్ ఐపీఎల్ 2025 వాయిదా పడకముందే గాయపడ్డాడు. ఐపీఎల్ వాయిదా అనంతరం ఆస్ట్రేలియా వెళ్లిన హేజిల్వుడ్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో భారత్ రాడని అందరూ భావించారు. అయితే ఆర్సీబీకి హేజిల్వుడ్ కీలక పేసర్ కాబట్టి.. యాజమాన్యం చర్చల కారణంగా అతడిని పంపేందుకు ఆస్ట్రేలియా బోర్డు ఒప్పుకుంది. దాంతో ఐపీఎల్ సీజన్ అయిపోయే వరకు హేజిల్వుడ్ అందుబాటులో ఉండనున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా తమ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వడంతో లుంగి ఎంగిడి జట్టులో చేరాడు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రొమారియో షెపర్డ్ ఇప్పటికే ఆర్సీబీ జట్టులో చేరాడు. ఐర్లాండ్ సిరీస్కు ఎంపికైనా వెస్టిండీస్ బోర్డును ఒప్పించుకుని తిరిగి భారత్ వచ్చేశాడు. ఐపీఎల్ 2025 ముగిసే వరకు ఫిల్ సాల్ట్ అందుబాటులో ఉంటాడు. వెస్టిండీస్తో జరిగే టీ20 సిరీసులో ఇంగ్లాండ్ జట్టులో సాల్ట్ భాగమైనా.. జూన్ 6న మ్యాచులు ప్రారంభమవుతాయి. టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్స్టోన్ కూడా టోర్నీ ముగిసేవరకు అందుబాటులో ఉంటారు. దాంతో ఆర్సీబీ జట్టు ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. స్వదేశీ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ, యశ్ దయాల్ కూడా మంచి ఫామ్ మీదున్నారు. ఈ ఏడాది ఆర్సీబీ తొలి టైటిల్ కల నెరవేరేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో విజయం సాధిస్తే అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..