MS Dhoni: ఎంఎస్ ధోనీని ఔట్ చేయడంలో మరే ఉద్దేశం లేదు: భారత బౌలర్
- ఎంఎస్ ధోనీని ఔట్ చేయడం నా అదృష్టం
- ధోనీని ఔట్ చేయడంలో మరే ఉద్దేశం లేదు
- మ్యాచ్ ముగిసేవరకూ సంబరాలు చేసుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఔట్ చేయడం తన అదృష్టం అని భారత బౌలర్ యశ్ దయాళ్ తెలిపాడు. చివరి ఓవర్లో ఫోకస్ అంతా బౌలింగ్పైనే పెట్టానని చెప్పాడు. ధోనీ వికెట్ తీయడంలో మరే ఉద్దేశం లేదని యశ్ దయాళ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యశ్ దయాళ్.. చెన్నై కెప్టెన్ ధోనీని ఎల్బీగా పెవిలియన్కు చేర్చాడు. అప్పటి వరకు చెన్నై వైపు ఉన్న మ్యాచ్ను యశ్ అద్భుత బంతితో ఆర్సీబీ వైపు తిప్పాడు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైనప్పుడు శివమ్ దూబె సింగిల్ మాత్రమే తీయడంతో ఆర్సీబీ విజయం సాధించింది.
బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ దయాళ్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఐపీఎల్ 2024, ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీని ఔట్ చేయడం కెరీర్లో అదృష్టంగా భావిస్తా అని చెప్పాడు. ‘బెంగళూరు విజయానికి చివరి ఓవర్ చాలా కీలకం. ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా.. తర్వాత బంతిని ఎలా సంధించాలన్న దానిపైనే దృష్టి పెట్టాను. ఇంతకు ముందు నేను ఇలాంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేశాను. నేను బాగా బౌలింగ్ చేయగలనని బలంగా నమ్మా. గతేడాదికి, ఇప్పటికి తేడా పెద్దగా లేదు. పిచ్లో ఎలాంటి మార్పు లేదు’ అని యశ్ దయాళ్ చెప్పాడు.
Also Read
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
Also Read: Punjab Kings: మాక్స్వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్.. పీఎస్ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్కి!
‘ఎంఎస్ ధోనీ అప్పుడు క్యాచ్ ఔట్ కాగా.. ఈసారి ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. నాకు వికెట్ తీయాలనే ఉద్దేశ్యం లేదు. జట్టు గెలుపే మాకు ముఖ్యం. ధోనీని ఔట్ చేయడం నా కెరీర్లో అదృష్టంగా భావిస్తా. చివరి బంతికి నాలుగు రన్స్ అవసరమైనప్పుడు శివమ్ దూబె సింగిల్ మాత్రమే తీశాడు. అప్పటికీ ఆర్సీబీ చెలిచిందని నేను అనుకోలేదు. నాకు దగ్గరలో ఉన్న బెతెల్ను బంతి విసరమని చెప్పా. మ్యాచ్ ముగిసేవరకూ సంబరాలు చేసుకోలేదు. విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని యశ్ దయాళ్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో బెంగళూరు దాదాపుగా ప్లేఆఫ్స్కు చేరుకున్నట్లే.
తాజావార్తలు
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..