ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక మార్పులకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంఛైజీలో కీలక సభ్యులై డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ లను వారి పదవుల నుంచి తప్పించాలని ఆర్సీబీ యాజమాన్యం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బౌలింగ్ కోచం ఆడమ్ గ్రిఫ్ఫిత్ ను మాత్రం జట్టుతోనే ఉంచుకునేందుకు బెంగళూరు టీమ్ యాజమాన్యం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
Read Also: Drumstick Cultivation: మునగ సాగులో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కాగా, సంజయ్ బాంగర్, మైక్ హెస్సన్లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నాట్లు తెలుస్తోంది. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్గా నియమించుకుంది. కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచి సన్నాహకాలు స్టార్ట్ చేశాయి. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఏకంగా తమ హెడ్ కోచ్ను మార్చేసింది.. ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ను హెడ్ కోచ్గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ కూడా లక్నో బాటలోనే నడిచేందుకు ప్లాన్ చేస్తుంది.
Read Also: Harish Rao : మారథాన్ రన్లో అందరూ పాల్గొనాలి
ఇదిలా ఉంటే.. మంచి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, జట్టు నిండా స్టార్లతో కూడిన ఆర్సీబీ టీమ్ ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించ లేదు. 2009, 2011 సీజన్లలో మాత్రం ఆ టీమ్ రన్నరప్గా నిలిచింది. అయితే, ఇటీవలే ముగిసిన 2023 సీజన్లో.. కనీసం.. ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్కు కూడా అర్హత సాధించలేకపోయింది. జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలోనే యాజమాన్యం ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని సమాచారం.