మార్చి 31, 2024 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పనిచేయబోతున్నాయి. ఈ మేరకు ఆర్బిఐ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. మార్చి 31, 2024 ఆదివారం నాడు ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా బ్యాంకు సేవలందిస్తాయని ఆర్బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు రోజు ఆదివారం కావడంతో ఆర్బిఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దింతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పనిచేయాలని ఆర్బిఐ ఈ మేరకి సూచించింది.
మాములుగా మార్చి 31న ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన వెంటనే ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తాయి. బ్యాంకు దస్త్రాల ఆడిటింగ్ కోసం మళ్లీ ఏప్రిల్ 1న బ్యాంకు లావాదేవీలను నిర్వహించరు. దాంతో ఈ ఏడాది మార్చి 31 ఆదివారం కావడంతో ఆ రోజు పనిచేయాలని ఆర్బిఐ ఆదేశించింది. 2023-34 ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీలను, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు, జమలను యథావిధిగా కొనసాగించాలని ఆర్బిఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి
మార్చి 31న ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని శాఖలను బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులకు ఆర్బీఐ తెలిపింది. మాములుగా ప్రతి నెలా అన్ని ఆదివారాలు, వాటితోపాటు 2, 4 శనివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.