RBI : వరుసగా ఐదోసారి రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఉదయం ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అక్టోబర్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ తెలిపారు. శుక్రవారం మూడు రోజుల ద్రవ్య విధాన సమావేశం ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 6.50శాతం నుంచి మార్చలేదు. ఆర్బీఐ రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా ఐదోసారి.
Read Also:Fighter Teaser: హాలీవుడ్ ‘టాప్ గన్ మేవరిక్’ రేంజులో ఉంది…
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
ఆరుగురు సభ్యుల MPC ప్యానెల్ రేట్లను యథాతథంగా ఉంచాలనే నిర్ణయంపై ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఆరుగురు సభ్యులలో ఐదుగురు వైఖరిని కొనసాగించాల్సిన అవసరంపై ఓటు వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మార్చలేదనే వార్తల కారణంగా భారతీయ మార్కెట్లు పుంజుకున్నాయి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఈ రోజు 21 వేల మార్కును దాటింది. అదే సమయంలో సెన్సెక్స్ కూడా అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. సెన్సెక్స్ కూడా ప్రకటనకు ముందు 69888.33 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రకటన తర్వాత దాని ఆధిక్యాన్ని కొనసాగించింది. 0.4శాతం పెరిగి 69779.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 21006 గరిష్ట స్థాయిని తాకింది. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.
Read Also:Alia Bhatt : రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో స్టన్నింగ్ లుక్ లో ఆకట్టుకున్న అలియా భట్.. పిక్స్ వైరల్..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నట్లు ద్రవ్య విధాన కమిటీ భావిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం తర్వాత భారతీయ మార్కెట్లో లిక్విడిటీని కొనసాగించడానికి రిజర్వ్ బ్యాంక్ చాలా ప్రయత్నాలు చేసిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం పరిధిలో ఉంచడం ఇప్పటి వరకు సాధ్యం కాలేదని, దాని కోసం ప్రయత్నిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!