Khalistan: గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర.. RAW ప్రమేయం ఉందన్న యూఎన్..!
Khalistan: సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘RAW’ అధికారి ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం నాడు న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఆ అధికారి పేరును విక్రమ్ యాదవ్గా గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. అమెరికాలోని సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ ఖలిస్థానీల కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. భారత ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించడంతో.. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు మండిపడినట్లు ఆ కథనంలో పేర్కొంది.
Read Also: PM Modi: నేడు తెలంగాణకు మోడీ.. జహీరాబాద్, మెదక్ లో ప్రధాని ప్రచారం..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
అయితే, అమెరికా నిఘా విభాగాలు గురుపత్వంత్పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని ఈ సందర్భంగా వాష్టింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ‘RAW’ ఉన్నతాధికారుల పర్మిషన్ తోనే విక్రమ్ యాదవ్ పన్నూపై ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉందని అమెరికా నిఘా, గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనంలో వెల్లడించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్ను హతమార్చే పథకం గురించి తెలుసని.. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Gun Fire : నార్త్ కరోలినాలో కాల్పులు.. ముగ్గురు అధికారులు మృతి.. ఐదుగురికి గాయాలు
అలాగే, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ కు ఈ విషయం తెలిసే ఛాన్స్ ఉన్నా.. అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని అమెరికా అధికారులను వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో తెలిపింది. విదేశాల్లోని తమ శత్రువులను నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయి.. వాటిపై పరిశోధనల క్రమంలోనే గురుపత్వంత్ సింగ్పై హత్యాయత్నం వివరాలను, ఆధారాలను సేకరించే ప్రయత్నం జరిగిందని అమెరికన్ బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఈ విషయాన్ని పేర్కొనింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!