Khalistan: గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర.. RAW ప్రమేయం ఉందన్న యూఎన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్ గూఢచర్య సంస్థ ‘RAW’ అధికారి ప్రమేయం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సోమవారం నాడు న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఆ అధికారి పేరును విక్రమ్ యాదవ్గా గుర్తించినట్లు చెప్పుకొచ్చింది. అమెరికాలోని సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ ఖలిస్థానీల కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. భారత ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించడంతో.. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు మండిపడినట్లు ఆ కథనంలో పేర్కొంది.
Read Also: PM Modi: నేడు తెలంగాణకు మోడీ.. జహీరాబాద్, మెదక్ లో ప్రధాని ప్రచారం..
Also Read
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
అయితే, అమెరికా నిఘా విభాగాలు గురుపత్వంత్పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని ఈ సందర్భంగా వాష్టింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. ‘RAW’ ఉన్నతాధికారుల పర్మిషన్ తోనే విక్రమ్ యాదవ్ పన్నూపై ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉందని అమెరికా నిఘా, గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనంలో వెల్లడించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్ను హతమార్చే పథకం గురించి తెలుసని.. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Gun Fire : నార్త్ కరోలినాలో కాల్పులు.. ముగ్గురు అధికారులు మృతి.. ఐదుగురికి గాయాలు
అలాగే, జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోవల్ కు ఈ విషయం తెలిసే ఛాన్స్ ఉన్నా.. అందుకు ఖచ్చితమైన ఆధారాలు లేవని అమెరికా అధికారులను వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనంలో తెలిపింది. విదేశాల్లోని తమ శత్రువులను నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయి.. వాటిపై పరిశోధనల క్రమంలోనే గురుపత్వంత్ సింగ్పై హత్యాయత్నం వివరాలను, ఆధారాలను సేకరించే ప్రయత్నం జరిగిందని అమెరికన్ బిలియనీర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ఈ విషయాన్ని పేర్కొనింది.
తాజావార్తలు
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
-
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!