Jyoti Deshpande: పాకిస్థాన్లోనూ ‘ధురంధర్’ హిట్.. మూవీ సక్సెస్పై నిర్మాత ఫస్ట్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyoti Deshpande: రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజునుంచే మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుగొట్టింది. ఈ సినిమా విజయంపై నిర్మాత జ్యోతి దేశ్పాండే తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఫార్చూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి దేశ్పాండే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది కేవలం మేకర్స్ గెలుపు కాదని, ప్రేక్షకుల విజయమని స్పష్టం చేశారు. చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ఊహాశక్తిని పూర్తిగా ఆకట్టుకున్న సినిమా ఇదేనని గర్వంగా తెలిపారు. ఈ సినిమాను ఒక్కసారి చూసిన ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వరుస కట్టారన్నారు. 60 రోజులకు పైగా థియేటర్లలో నిలబడటం అంటే అది సాధారణ విషయం కాదన్నారు. ఈ సినిమాను ఆమె లెజెండరీ మూవీ ‘షోలే’తో పోల్చారు. షోలే తర్వాత ఇంత స్థాయిలో ప్రభావం చూపిన సినిమా గుర్తుకు రావడం లేదని తెలిపారు.
READ MORE: Aavesham 2: రంగన్న ఈజ్ బ్యాక్! ‘ఆవేశం 2’పై ఫహద్ ఫాజిల్ అఫీషియల్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read
- AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
- Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
- Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్లో ఆ మాటలు వినిపించవు
- Sabir Bhatia: 2012లో ఫ్లాట్ బుక్ చేస్తే.. 2032లో చేతికి తాళాలు!.. కుబేరుడికే ఈ గతి పడితే సామాన్యుడి పరిస్థితేంటి?
ఇక ‘ధురంధర్ 2’ అంశంపై జ్యోతి దేశ్పాండే తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమా మార్చి 19న థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్ కాకపోతే రెండో భాగం అల్మారాలోనే ఉండిపోయేదని జ్యోతి దేశ్పాండే నిజాయితీగా చెప్పారు. కానీ మొదటి భాగం తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే రెండో భాగంపై ముందే పని మొదలుపెట్టామని అన్నారు. ప్రేక్షకులు సినిమాను ఇంతగా ఆదరించడంతో తమ ఆనందానికి హద్దులేదని చెప్పారు. ‘ధురంధర్ 2’ మొదటి వర్షన్ కంటే అద్భుతంగా ఉంటుందని.. ఈసారి ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. ధురంధర్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఒక్క భాషలో వచ్చిన సినిమా ఇంత పెద్ద స్థాయిలో విజయం సాధించడం ఇదే మొదటిసారి అని జ్యోతి చెప్పారు. ఈ సినిమా సౌత్ సినిమాల రికార్డులను బద్దలు గొట్టిందని అన్నారు. హిందీ వెర్షన్కే దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన కలెక్షన్లు, ఇతర పెద్ద హిందీ సినిమాల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. పాకిస్థాన్లోనూ అత్యధికంగా చూసిన సినిమాగా ధురంధర్ నిలిచిందని చెప్పారు.
READ MORE: Sarvam AI: ఏఐ రంగంలో భారత్ సంచలనం.. చాట్జీపీటీ, జెమినీలను వెనక్కి నెట్టిన భారత్ ఏఐ!
తాజావార్తలు
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
-
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్లో ఆ మాటలు వినిపించవు
-
Mrunal Thakur: ధనుష్ తో బ్రేకప్, క్రికెటర్ తో డేటింగ్.. వైరల్ అవుతున్న మృణాల్ ప్రేమ ముచ్చట్లు
-
Unemployment Crisis: చేతిలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం ఎందుకు దొరకడం లేదు? షాకింగ్ రిపోర్ట్
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?