Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్మాసిటీ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు ఇకపై అక్కడ వ్యవసాయం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించింది.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఆర్డీవో అనంతరెడ్డి శనివారం స్వయంగా పరిశీలించారు. నానక్ నగర్, మేడిపల్లి, కుర్మీద్ద, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి అసైన్డ్ భూముల స్థితిగతులను అంచనా వేశారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జారీ చేసిన తాజా ఆదేశాలను ఈ సందర్భంగా రైతులకు వివరించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
పంటల సాగుపై నిషేధం..
గతంలోనే ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 14 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రైతులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించడం జరిగిందని ఆర్డీవో గుర్తుచేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందుకున్న రైతులు, రాబోయే వర్షాకాలం సీజన్లో సేకరించిన భూముల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు వేయకూడదని, ఎలాంటి పంటలు సాగు చేయవద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
నష్టపరిహారం పొందిన తర్వాత ఆ భూమిపై హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని, కాబట్టి అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. రైతులు అధికారుల సూచనలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో స్థానిక తహశీల్దార్ అయ్యప్పతో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. భూముల స్వాధీనం విషయంలో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. గతంలో భూసేకరణ సమయంలో కొన్ని గ్రామాల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. మెజారిటీ రైతులకు పరిహారం అందించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూములను అభివృద్ధి పనులకు సిద్ధం చేస్తున్న తరుణంలో.. అక్కడ మళ్లీ సాగు చేపడితే పనులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరైనా ఆదేశాలు ధిక్కరించి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!