Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్మాసిటీ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు ఇకపై అక్కడ వ్యవసాయం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించింది.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఆర్డీవో అనంతరెడ్డి శనివారం స్వయంగా పరిశీలించారు. నానక్ నగర్, మేడిపల్లి, కుర్మీద్ద, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి అసైన్డ్ భూముల స్థితిగతులను అంచనా వేశారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జారీ చేసిన తాజా ఆదేశాలను ఈ సందర్భంగా రైతులకు వివరించారు.
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
పంటల సాగుపై నిషేధం..
గతంలోనే ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 14 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రైతులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించడం జరిగిందని ఆర్డీవో గుర్తుచేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందుకున్న రైతులు, రాబోయే వర్షాకాలం సీజన్లో సేకరించిన భూముల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు వేయకూడదని, ఎలాంటి పంటలు సాగు చేయవద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
నష్టపరిహారం పొందిన తర్వాత ఆ భూమిపై హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని, కాబట్టి అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. రైతులు అధికారుల సూచనలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో స్థానిక తహశీల్దార్ అయ్యప్పతో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. భూముల స్వాధీనం విషయంలో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. గతంలో భూసేకరణ సమయంలో కొన్ని గ్రామాల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. మెజారిటీ రైతులకు పరిహారం అందించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూములను అభివృద్ధి పనులకు సిద్ధం చేస్తున్న తరుణంలో.. అక్కడ మళ్లీ సాగు చేపడితే పనులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరైనా ఆదేశాలు ధిక్కరించి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!