Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్మాసిటీ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు ఇకపై అక్కడ వ్యవసాయం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించింది.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటన..
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఆర్డీవో అనంతరెడ్డి శనివారం స్వయంగా పరిశీలించారు. నానక్ నగర్, మేడిపల్లి, కుర్మీద్ద, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి అసైన్డ్ భూముల స్థితిగతులను అంచనా వేశారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి జారీ చేసిన తాజా ఆదేశాలను ఈ సందర్భంగా రైతులకు వివరించారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
పంటల సాగుపై నిషేధం..
గతంలోనే ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 14 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రైతులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించడం జరిగిందని ఆర్డీవో గుర్తుచేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందుకున్న రైతులు, రాబోయే వర్షాకాలం సీజన్లో సేకరించిన భూముల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు వేయకూడదని, ఎలాంటి పంటలు సాగు చేయవద్దని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
నష్టపరిహారం పొందిన తర్వాత ఆ భూమిపై హక్కులు ప్రభుత్వానికే ఉంటాయని, కాబట్టి అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. రైతులు అధికారుల సూచనలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో స్థానిక తహశీల్దార్ అయ్యప్పతో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్ శివార్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ ప్రాజెక్టుపై గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. భూముల స్వాధీనం విషయంలో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. గతంలో భూసేకరణ సమయంలో కొన్ని గ్రామాల రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. మెజారిటీ రైతులకు పరిహారం అందించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ భూములను అభివృద్ధి పనులకు సిద్ధం చేస్తున్న తరుణంలో.. అక్కడ మళ్లీ సాగు చేపడితే పనులకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరైనా ఆదేశాలు ధిక్కరించి సాగు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!