Vijaya Shanthi : ట్వీట్ చేసిన రాములమ్మ.. కమలం వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య లొల్లి ఆగేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి.. ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమలం పార్టీగా మారాయి. ఇన్నాళ్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడ రేవంత్ రెడ్డి మీద ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ లను ఉద్దేశిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పలు సూచనలు చేశారు. నిరంతరం తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో తన బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ విమర్శల దాడిని ఒకరిపైమరొకరు చేసుకోవడం సరికాదన్నారు.
ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక,ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల,సవాళ్ల దాడులు, బీఆరెస్కు వేడుకలవుతున్నాయి. బీఆరెస్తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ గారు,ఈటలగారు తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 22, 2023
Also Read : Shriya : 20ఏళ్ల తర్వాత చిరుతో చిందేయనున్న శ్రియ
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కొంచెం ఆలోచించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ చెప్పడం తన బాధ్యత అన్నారు. దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోందని విజయశాంతి పేర్కొన్నారు. ఇది మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమని తెలిపారు.
Also Read : Prabhas: ఒకడే ఇద్దరు కదా… ‘రాముడు’ మరియు ‘రాక్షసుడు’
దీనికి గల కారణాలు కూడా ఉన్నాయాని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడ వలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉందనేది నిజమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటలు, సవాళ్ల దాడులు, బీఆర్ఎస్ కు వేడుకలవుతున్నాయని విజయశాంతి చెప్పుకొచ్చారు. మరి విజయశాంతి మాటలను రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ వింటారో లేదో చూడాలి మరీ..
తాజావార్తలు
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
ట్రెండింగ్
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!