Shashi Tharoor : ‘జనవరిలో రామమందిరం, ఫిబ్రవరిలో అబుదాబి ఆలయం ఆపై..’, ప్రధాని మోడీ ఎన్నికల వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor : అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దీనిపై రాజకీయాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీనిపై అధికార బీజేపీ, విపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దేవాలయం సాకుతో బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం, కొన్ని రోజుల తర్వాత అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయం ప్రారంభోత్సవం గురించి, శశి థరూర్ ఈ రెండు సంఘటనలు 2024 ఎన్నికలకు వేదికగా నిలుస్తాయని చెప్పారు. త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని శశిథరూర్ జోస్యం చెప్పారు. 2024కి తాను హిందూ హృదయ సామ్రాట్ అనే సందేశం ఇవ్వాలనుకుంటున్నారని, అయితే ఆ మంచి రోజులు ఏమయ్యాయని థరూర్ ప్రశ్నించారు.
Read Also:TS Covid-19: 24 గంటల్లో 18 పాజిటివ్ కేసులు.. ముప్పు తప్పదు అంటున్న వైద్యులు
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
జనవరిలో రామమందిరం కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనే దానిపై ఒకవైపు ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు యూఏఈలో అతిపెద్దదైన అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించాలన్న ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారు. శశి థరూర్ మాట్లాడుతూ, “2019లో నోట్ల రద్దు కారణంగా పరిస్థితులు అదుపు తప్పాయి. నరేంద్ర మోడీ సార్వత్రిక ఎన్నికలలో పుల్వామా ఉగ్రదాడిని జాతీయ భద్రత సమస్యగా మార్చింది. ఇప్పుడు 2024 లో ఎన్నికలు హిందుత్వ వర్సెస్ ప్రజా సంక్షేమం కాబోతున్నాయని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. అయితే ఆ మంచి రోజులు ఏమయ్యాయన్న ప్రశ్న తలెత్తుతోంది. అప్పట్లో ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? అవినీతిని నిర్మూలించి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నా రూ. 15 లక్షలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
Read Also:Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!
రామ మందిర ప్రారంభోత్సవం జాతీయ సమస్యగా మారడం తనను ఇబ్బంది పెడుతుందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా అన్నారు. శశి థరూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మతం వ్యక్తిగత సమస్య అని, తాను కూడా రామాలయాన్ని సందర్శించాలనుకుంటున్నానని, అయితే 2024 ఎన్నికల ముందు ప్రారంభోత్సవం కాదన్నారు. ఇంతకుముందు కూడా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని థరూర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..