Shashi Tharoor : ‘జనవరిలో రామమందిరం, ఫిబ్రవరిలో అబుదాబి ఆలయం ఆపై..’, ప్రధాని మోడీ ఎన్నికల వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor : అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవానికి ముందు దీనిపై రాజకీయాలు కూడా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీనిపై అధికార బీజేపీ, విపక్షాలు పరస్పరం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దేవాలయం సాకుతో బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం, కొన్ని రోజుల తర్వాత అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయం ప్రారంభోత్సవం గురించి, శశి థరూర్ ఈ రెండు సంఘటనలు 2024 ఎన్నికలకు వేదికగా నిలుస్తాయని చెప్పారు. త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని శశిథరూర్ జోస్యం చెప్పారు. 2024కి తాను హిందూ హృదయ సామ్రాట్ అనే సందేశం ఇవ్వాలనుకుంటున్నారని, అయితే ఆ మంచి రోజులు ఏమయ్యాయని థరూర్ ప్రశ్నించారు.
Read Also:TS Covid-19: 24 గంటల్లో 18 పాజిటివ్ కేసులు.. ముప్పు తప్పదు అంటున్న వైద్యులు
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనవరిలో రామమందిరం కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనే దానిపై ఒకవైపు ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు యూఏఈలో అతిపెద్దదైన అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని ప్రారంభించాలన్న ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారు. శశి థరూర్ మాట్లాడుతూ, “2019లో నోట్ల రద్దు కారణంగా పరిస్థితులు అదుపు తప్పాయి. నరేంద్ర మోడీ సార్వత్రిక ఎన్నికలలో పుల్వామా ఉగ్రదాడిని జాతీయ భద్రత సమస్యగా మార్చింది. ఇప్పుడు 2024 లో ఎన్నికలు హిందుత్వ వర్సెస్ ప్రజా సంక్షేమం కాబోతున్నాయని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. అయితే ఆ మంచి రోజులు ఏమయ్యాయన్న ప్రశ్న తలెత్తుతోంది. అప్పట్లో ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? అవినీతిని నిర్మూలించి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో వేస్తామన్నా రూ. 15 లక్షలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
Read Also:Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!
రామ మందిర ప్రారంభోత్సవం జాతీయ సమస్యగా మారడం తనను ఇబ్బంది పెడుతుందని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా అన్నారు. శశి థరూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మతం వ్యక్తిగత సమస్య అని, తాను కూడా రామాలయాన్ని సందర్శించాలనుకుంటున్నానని, అయితే 2024 ఎన్నికల ముందు ప్రారంభోత్సవం కాదన్నారు. ఇంతకుముందు కూడా తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని థరూర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?