Raksha Bandhan 2024: రాఖీ ఇలా కడుతున్నారా?..
- ఇవాళ ఆగస్టు 19న దేశవ్యాప్తంగా రక్షా పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నాం..
- ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైన రోజు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan 2024: ఇవాళ ఆగస్టు 19న దేశవ్యాప్తంగా రక్షా పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈసారి రక్షాబంధన్ చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే.. ఈసారి రక్షాబంధన్ శ్రావణ సోమవారం నాడు రావడం ఒక విశేషం అయితే.. రక్షాబంధన్ రోజు ఏడు విశేష శుభయోగాలు ఏర్పడుతున్నాయి. రాఖీ పండుగ నాడు రవియోగం, శశరాజయోగం, బుధాదిత్య యోగం, శోభనయోగం, సర్వార్ధ సిద్ధి యోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం రక్షాబంధనం నాడు ఏర్పడతాయి. అన్న చెల్లెల్ల బంధానికి ప్రతీకగా చెప్పబడే రక్షాబంధన్ రోజున, తోడబుట్టిన జీవితాల్లో అపారమైన ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి కొన్ని పనులు చేయాలని చెబుతారు.రాఖీ పండుగకు సోదరులకు రాఖీ కట్టడం, మిఠాయిలు తినిపిస్తే సరిపోతుందని చాలా మంది అనుకుంటారు. కానీ.. రాఖీ పండుగ నాడు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వారి గురించి అందరూ తెలుసుకోవాలి.
Read also: Heavy Vehicles: ఉదయం 7 గంటల తర్వాత సిటీలోకి భారీ వాహనాలు నో ఎంట్రీ..
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
రాఖీ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీ కట్టే కార్యక్రమం చాలా నియమాలతో జరగాలి. వినాయక చవితి, దసరా పండుగలను ఎలా జరుపుకుంటామో, అదే నియమ నిబంధనలతో రాఖీ పండుగను జరుపుకోవాలి. రాఖీ కట్టే అమ్మాయిలు తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేసి రాఖీ కట్టే ముందు అన్నదమ్ములను కూర్చోబెట్టి రాఖీ కట్టడం చాలా మంచిది. సోదరుడు తూర్పు వైపు కాకుండా ఉత్తరం వైపు ఉండేలా కూర్చొని రాఖీ కట్టాలి. పొరపాటున కూడా దక్షిణ దిశలో కూర్చోవద్దు. దక్షిణ దిక్కున కూర్చుని రాఖీ కడితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అన్న, తమ్ములు రాఖీలు కట్టే ముందు దేవుడికి నమస్కరించాలి. వినాయకుడి ఫోటో లేదా విగ్రహానికి బొట్టు పెట్టి ఆ తరువాత సోదరులకు రాఖీ కట్టాలి. సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి రాఖీ కట్టాలి. ఆ తర్వాత మిఠాయి తినిపించాలి. అంతేకాదు రాఖీ కట్టేటప్పుడు అన్నదమ్ములు శ్లోకం పఠించి రాఖీ కట్టాలి. “యేన బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల” అనే మంత్రాన్ని పఠించి రాఖీ కట్టడం మంచిది.
రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి.. నియమాలు ఏమిటి?
తాజావార్తలు
-
Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
-
Rahul Gandhi: సీజేపీ నిరసనలపై స్పందించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!