Raksha Bandhan Festival 2023: రాఖీ పండుగ ఏ రోజు.. ఆగస్టు 30 లేక 31?.. ఏ రోజు రాఖీ కట్టాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan Festival 2023: భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే రక్షాబంధన్ వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈ పండుగ అన్నా చెల్లె, తమ్ముడు అక్కల మధ్య బంధాన్ని, అనురాగాన్ని, ప్రేమను తెలుపుతుంది. ఈ పండుగలో అక్కా, చెల్లెల్లు అన్నలు, తమ్ముల మణికట్టుకు రాఖీలు కడతారు. రాఖీ వారి దీర్ఘాయుష్షు, సంతోషాన్ని సూచిస్తుంది. అలాగే అన్నలు చెల్లెల్లకు బహుమతులు ఇస్తూ ఆమెకు ఎప్పుడూ అండగా, రక్షణగా ఉంటానని మాటిస్తారు. ఈ ఏడాది రాఖీ రోజున తోబుట్టువులంతా వారి సోదరులకు రాఖీలు కట్టాలని ఏర్పాట్లు చేసుకుంటునన్నారు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగను జరుపుకునే విషయంలో ఓ సమస్య వచ్చి పడింది. ఏ రోజున రాఖీ పండుగ జరుపుకోవాలి.. ఆగస్టు 30న లేక 31వ తేదీనా.. ఏ రోజు జరుపుకోవాలనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది.
Read Also: Chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ ప్రజ్ఞాన్ రోవర్ చక్కర్లు.. వీడియోను షేర్ చేసిన ఇస్రో
Also Read
- Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
సాధారంగా ఈ పండుగను ‘రాఖీ లేదా రక్షా బంధన్’ అనే పేరుతో పిలుస్తారు. రక్షా బంధన్.. ప్రతి ఏడాది శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు వస్తుంది. ఈ పండుగ రోజున సోదరీమణులు.. సోదరుల శ్రేయస్సు, దీర్ఘాయువు కోరుతూ.. వారి సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. రక్షా బంధన్ ప్రతి ఏడాది పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ సారి రక్షా బంధన్ పండుగను భద్రకాలం కారణంగా ఆగస్టు 30, 31 తేదీన రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. అయితే వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాఖీ పండుగను ఎప్పుడూ కూడా భద్రకాలం లేని కాలంలోనే జరుపుకోవాలి. రక్షాబంధన్ ఆగస్టు 30 న మొదలవుతోంది . అయితే ఆ రోజున భద్రకాలం ఉంది. ఆగస్టు 30న రాత్రి 9:01 గంటలకు భద్రకాలం ముగుస్తుంది. అందువల్ల ఈ పండుగను ఆగస్ట్ 31న జరుపుకోవటం ఆమోదయోగ్యమైనదని పండితులు చెబుతున్నారు. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31 రోజున రాఖీ పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Bhojshala case: భోజ్శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!