ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఆదివారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే.. గత కొన్నేళ్లు గా వార్తల్లో నిలుస్తున్నారు మాస్టర్.. తాను ఎంతో మందిని మాస్టర్స్ గా చేశారు.. ఈయన స్టార్ హీరోల అందరిచేత కాలు కదిపించాడు.. దాదాపు 1500 లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ పనిచేసిన ఘనత మాస్టర్ సొంతం.. ఆయన మరణ వార్త విని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారని సమాచారం.. అయితే రాకేష్ మాస్టర్ ప్రియ శిష్యుడైన స్టార్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన గురువును కడసారి చూసేందుకు వస్తారా? రారా? అన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి..
రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం రక్తపు విరేచనాలు కావడంతో ఇక పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు.. తెలుగు పరిశ్రమలో ప్రముఖ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమాలతో ఆయనకు డ్యాన్స్ మాస్టర్గా మంచి పేరు వచ్చింది. తెలుగులో వైవీఎస్ రూపొందించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ ‘దేవదాసు’ సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేసారు. ఆ సినిమాలు హిట్ అవ్వడంతో ఆయనకు మంచి పేరు వచ్చింది.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాల్లో నటించారు
ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చక్రం తిప్పుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం గమనార్హం. ఇక, కానరాని దూరాలకు వెళ్లిపోయిన రాకేష్ మాస్టర్ను ఆఖరి చూపును చూసేందుకు వాస్తారా? లేదా అని గస్త్స్ 24 గంటల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి..రాకేష్ మాస్టర్ చనిపోయాక అంతా శేఖర్ మాస్టర్ వస్తారని అనుకుంటున్నారు. అదే నిజమైంది శేఖర్ మాస్టర్ గురువును చివరి చూపును చూడటానికి వచ్చినట్లు తెలుస్తుంది.. మాస్టర్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వాళ్లిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. అయితే మధ్యలో ఇద్దరికీ చెడిన విషయం తెలిసిందే.. ఏమైనా కూడా ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది..