Rajnath Singh: హిమగిరి, ఉదయగిరి యుద్ధనౌకలు దేశానికి అంకితం.. విశాఖలో రక్షణ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: నేడు విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. దీనితో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ శక్తి మరింతగా పెరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు భారత సాంకేతిక సామర్ధ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి.
Ganesh Idol Trunk: గణపయ్య విగ్రహంలో తొండం ఎటు వైపు ఉండాలంటే.. కుడి వైపా? ఎడమ వైపా?
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇండో-పసిఫిక్ ప్రాంతం, చైనా సరిహద్దులలో వ్యూహాత్మక రక్షణలో ఈ రెండు నౌకలు కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించడం దేశ రక్షణలో మరో మైలురాయిగా నిలవనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ సిద్ధాంతానికి నిదర్శనంగా, మన దేశీయ MSME రంగం సాంకేతిక ప్రతిభ ఈ నౌకల్లో ప్రతిబింబిస్తోంది.
రక్షణ శాఖ లక్ష్యాల ప్రకారం 2050 నాటికి 200 యుద్ధనౌకలను నిర్మించాలనే ప్రణాళిక ఉందని, ఇది భారత నావికాదళ శక్తిని ప్రపంచ వేదికపై మరింత బలోపేతం చేస్తుందని మంత్రి అన్నారు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్య పోరు ఉన్నా, భారత్ మాత్రం “వసుధైక కుటుంబకం” అనే సూత్రాన్నే తన సిద్ధాంతంగా కొనసాగిస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన పహల్గాం దాడిపై తీవ్రంగా స్పందించిన రాజ్నాథ్ సింగ్, దానికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ త్రివిధ దళాల పాటవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ టీవీ ధరకు SVU కారు కొనొచ్చు కాదయ్యా.. Hisense UX ULED సిరీస్ టీవీలు లాంచ్!
ఈ ఆపరేషన్ ముగియలేదని, ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్కువ సమయంలోనే త్రివిధ దళాలు ఆపరేషన్ కోసం సిద్ధం కావడం జాతి మొత్తం గుర్తుంచుకుంటుందని తెలిపారు. ప్రధాని నేతృత్వంలో భారత రక్షణ దళాలు మరింత బలోపేతం అవుతున్నాయని, పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతికత, కార్యాచరణలతో దేశ భద్రతా వ్యవస్థ మరింతగా దృఢం అవుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!