Rajnath Singh: హిమగిరి, ఉదయగిరి యుద్ధనౌకలు దేశానికి అంకితం.. విశాఖలో రక్షణ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: నేడు విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. దీనితో విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ శక్తి మరింతగా పెరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి అనే రెండు యుద్ధ నౌకలను దేశానికి అంకితం చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలు భారత సాంకేతిక సామర్ధ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి.
Ganesh Idol Trunk: గణపయ్య విగ్రహంలో తొండం ఎటు వైపు ఉండాలంటే.. కుడి వైపా? ఎడమ వైపా?
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
ఇండో-పసిఫిక్ ప్రాంతం, చైనా సరిహద్దులలో వ్యూహాత్మక రక్షణలో ఈ రెండు నౌకలు కీలక పాత్ర పోషించనున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని నిర్మించడం దేశ రక్షణలో మరో మైలురాయిగా నిలవనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ సిద్ధాంతానికి నిదర్శనంగా, మన దేశీయ MSME రంగం సాంకేతిక ప్రతిభ ఈ నౌకల్లో ప్రతిబింబిస్తోంది.
రక్షణ శాఖ లక్ష్యాల ప్రకారం 2050 నాటికి 200 యుద్ధనౌకలను నిర్మించాలనే ప్రణాళిక ఉందని, ఇది భారత నావికాదళ శక్తిని ప్రపంచ వేదికపై మరింత బలోపేతం చేస్తుందని మంత్రి అన్నారు. హిందూ మహాసముద్రంలో ఆధిపత్య పోరు ఉన్నా, భారత్ మాత్రం “వసుధైక కుటుంబకం” అనే సూత్రాన్నే తన సిద్ధాంతంగా కొనసాగిస్తుందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన పహల్గాం దాడిపై తీవ్రంగా స్పందించిన రాజ్నాథ్ సింగ్, దానికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ త్రివిధ దళాల పాటవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ టీవీ ధరకు SVU కారు కొనొచ్చు కాదయ్యా.. Hisense UX ULED సిరీస్ టీవీలు లాంచ్!
ఈ ఆపరేషన్ ముగియలేదని, ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తక్కువ సమయంలోనే త్రివిధ దళాలు ఆపరేషన్ కోసం సిద్ధం కావడం జాతి మొత్తం గుర్తుంచుకుంటుందని తెలిపారు. ప్రధాని నేతృత్వంలో భారత రక్షణ దళాలు మరింత బలోపేతం అవుతున్నాయని, పరిశోధన, ఆవిష్కరణలు, సాంకేతికత, కార్యాచరణలతో దేశ భద్రతా వ్యవస్థ మరింతగా దృఢం అవుతుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..