Jeevika Mataji Temple : ఆ గుడిలో ప్రసాదంగా పానీపూరి, శాండ్విచ్లు.. అసలు స్టోరీ వింటే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాదారణంగా గుళ్లో పులిహోర బ్యాచ్ అంటుంటారు.. అంటే ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, స్వీట్స్ పెట్టడం మనం చూసే ఉంటాం.. కానీ పానీపూరీలు, పిజ్జాలు, వడాపావ్లనే నైవేద్యంగా పెట్టే ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. ఏంటి అలాంటి ఆలయం ఒకటుందా అనే సందేహం వస్తుంది కదూ.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం.. ఫాస్ట్ఫుడ్స్ కదా వీటిని నైవేద్యంగా పెట్టడం ఏంట్రా అనుకుంటున్నారా..? ఇవే కాదండోయ్ ఇంకా చాలా ఉన్నాయ్. శాండ్విచ్లు, కూల్డ్రింగ్స్ కూడా ఇస్తారట.. వామ్మో ఏంటి విచిత్రం అని అలోచిస్తున్నారా.. ఇక అస్సలు ఆలస్యం చెయ్యకుండా ఆ ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం..
ఈ ఆలయం గుజరాత్ ఉంది.. రాజ్కోట్లో ప్రత్యేకమైన జీవికా మాతాజీ ఆలయం ఉంది. ప్రతినిత్యం ఇక్కడ మాతాజీకి నమస్కరిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. విశేషమేమిటంటే ఇక్కడ భక్తులు మాతాజీకి పంచదార లేదా శ్రీఫాల్ను కాకుండా ఫాస్ట్ ఫుడ్ నైవేద్యంగా పెడతారు. రాజ్కోట్లోని రాజ్పుత్పరాలో 60-70 ఏళ్లనాటి జీవికా మాతాజీ ఆలయం ఉంది. ఇక్కడ స్త్రీలు తమ కోరికలు నెరవేరాలని ఉపవాసం ఉంటారు. మాతాజీ వారి కోరికలను కూడా తీరుస్తాడని భక్తులు గట్టిగా న్ముతున్నారు..
Also Read
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
- Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
జీవిక మాత పిల్లలకు తల్లి కాబట్టి పిల్లలకు ఇష్టమైన మాతాజీని భక్తితో పూజిస్తారు. అందుకోసం పిల్లలకు ఇష్టమైన చాక్లెట్, భేల్, వడపాన్, దబేలీ, శాండ్విచ్, హాట్డాగ్, పానీపూరి, పిజ్జా, శీతల పానీయాలు ప్రసాదంగా పెడతారు. సనాతన ధర్మం కాలంతో పాటు మారుతోందని, కాబట్టి కాలంతో పాటు మనం మారాల్సిన అవసరం ఉందని ఆచార్యజీ పేర్కొన్నారు. తినడం, త్రాగటంలో కొత్త మార్పు వచ్చింది. అప్పుడు పిల్లలకు ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ అమ్మకు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదన్నారు.
కొంతమంది పిల్లలకు ఇష్టమైన స్టేషనరీ కిట్, లంచ్ బ్యాగ్ వంటి వాటిని కూడా ప్రసాదంలో కలుపుతారు. భక్తులు జీవికా మాతాజీని ఆన్లైన్లో కూడా దర్శనం చేసుకుంటారట. ఈ ఆలయానికి దూరప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చె తల్లిగా జీవికా మాత ప్రసిద్ధికి ఎక్కింది.. కోరిన కోరికలు తీర్చేవారుగా భక్తులు కొలుస్తారు.. ఇక వారి కోరికలు తీరాకా మొక్కులు చెల్లించుకుంటారు.. ఆ ప్రసాదం తెసుకుంటే సకల రోగాలు కూడా నయం అవుతాయని ప్రజలు నమ్మతున్నారు.. ఇది చూడటానికి భక్తులు ఎక్కడ నుంచో వస్తున్నారు.. మీరు అటు వెళితే ఒకసారి వెళ్లి దర్శించండి..
తాజావార్తలు
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
-
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
-
Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!