Rajat Patidar: డేవిడ్ వార్నర్ రికార్డ్ ను సమం చేసిన ఆర్సీబీ కెప్టెన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోరు. ఇదివరకు 2023 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్పై చేసిన 233/3 రికార్డును ఆర్సీబీ బద్దలు కొట్టింది.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ అద్భుత ఇన్నింగ్స్తో సంచలనం సృష్టించాడు. మొదట 13 బంతుల్లో 21 పరుగులతో నెమ్మదిగా ఆడిన పటీదార్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై శివతాండవం సృష్టించాడు. చివరి 20 బంతుల్లోనే 72 పరుగులు రాబట్టి.. మొత్తం 33 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేశాడు. పటీదార్ ఈ ఇన్నింగ్స్తో ఓ అరుదైన రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వార్నర్ 2016 క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 93 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- ICC T20 Rankings: ఇంగ్లాండ్కు చెక్.. సిరీస్తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
- Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ మొదటి నుంచే వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిన గుజరాత్, ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. దీంతో ఆర్సీబీ సునాయాసంగా 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఫైనల్ కు చేరి టైటిల్ ఫేవరెట్గా మారింది. దీనికి కారణం చరిత్ర కూడా ఇప్పుడు ఆర్సీబీకే అనుకూలంగా ఉంది. 2018 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ప్రతి జట్టు కూడా క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే. గత ఏడాది కూడా ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను ఓడించి, అనంతరం ఫైనల్లో విజయం సాధించి తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
మొత్తంగా 2011లో ప్లేఆఫ్స్ వ్యవస్థ వచ్చినప్పటినుండి 15 సీజన్లలో 12 సార్లు క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే చివరికి ఛాంపియన్గా నిలిచింది. కేవలం మూడు సార్లు మాత్రమే ఆ జట్లు ఫైనల్లో ఓడిపోయాయి. అందులో 2016లో ఆర్సీబీ కూడా ఒకటి. అప్పట్లో క్వాలిఫయర్-1 గెలిచినా, ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. చూడాలిమరి ఈసారి పరిస్థి ఎలా ఉండబోతుందో.
తాజావార్తలు
-
Amit Shah: పదవి కంటే దేశం, విద్యార్థులే ముఖ్యమని మరోసారి నిరూపించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన
-
Rajinikanth: ఆత్మకథతో మరో సంచలనం.. రజనీకాంత్ బయోపిక్ ప్లాన్ నిజమేనా?
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Anahat Singh: భారత స్క్వాష్లో చరిత్ర సృష్టించిన అనాహత్ సింగ్.. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్కు చెక్.. సిరీస్తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!