Rajat Patidar: డేవిడ్ వార్నర్ రికార్డ్ ను సమం చేసిన ఆర్సీబీ కెప్టెన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోరు. ఇదివరకు 2023 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్పై చేసిన 233/3 రికార్డును ఆర్సీబీ బద్దలు కొట్టింది.
ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ అద్భుత ఇన్నింగ్స్తో సంచలనం సృష్టించాడు. మొదట 13 బంతుల్లో 21 పరుగులతో నెమ్మదిగా ఆడిన పటీదార్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై శివతాండవం సృష్టించాడు. చివరి 20 బంతుల్లోనే 72 పరుగులు రాబట్టి.. మొత్తం 33 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేశాడు. పటీదార్ ఈ ఇన్నింగ్స్తో ఓ అరుదైన రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వార్నర్ 2016 క్వాలిఫయర్-2లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 93 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
- Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా 'బ్రదర్'.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
- కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
- Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ మొదటి నుంచే వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిన గుజరాత్, ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. దీంతో ఆర్సీబీ సునాయాసంగా 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఫైనల్ కు చేరి టైటిల్ ఫేవరెట్గా మారింది. దీనికి కారణం చరిత్ర కూడా ఇప్పుడు ఆర్సీబీకే అనుకూలంగా ఉంది. 2018 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ప్రతి జట్టు కూడా క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే. గత ఏడాది కూడా ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను ఓడించి, అనంతరం ఫైనల్లో విజయం సాధించి తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
మొత్తంగా 2011లో ప్లేఆఫ్స్ వ్యవస్థ వచ్చినప్పటినుండి 15 సీజన్లలో 12 సార్లు క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే చివరికి ఛాంపియన్గా నిలిచింది. కేవలం మూడు సార్లు మాత్రమే ఆ జట్లు ఫైనల్లో ఓడిపోయాయి. అందులో 2016లో ఆర్సీబీ కూడా ఒకటి. అప్పట్లో క్వాలిఫయర్-1 గెలిచినా, ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. చూడాలిమరి ఈసారి పరిస్థి ఎలా ఉండబోతుందో.
తాజావార్తలు
-
Rohit Sharma-Team India: అగార్కర్తో విభేదాలు.. గంభీర్పై అసంతృప్తి.. టీమిండియాలో లుకలుకలు?
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్… పెంపుడు కుక్క బఘీరాకు కన్నీటి వీడ్కోలు
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
-
Virat Kohli-PV Sindhu: విరాట్ కోహ్లీ నా ‘బ్రదర్’.. పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!