Tempo Traveller Crash: కర్నూల్ బస్సు ప్రమాదం మరవ ముందే మరో ఘోరం.. 15 మంది మృతి!
- రాజస్థాన్లోని ఫలోడి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్
- అతివేగమే ప్రమాదానికి కారణం
- చిన్నాభిన్నం అయిన టెంపో ట్రావెలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tempo Traveller Crash: కర్నూల్ బస్సు ప్రమాదం మరవ ముందే మరో ఘోరం వెలుగు చూసింది. రాజస్థాన్లోని ఫలోడి జిల్లాలోని మటోడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భరత్మాల ఎక్స్ప్రెస్వేపై ఆదివారం సాయంత్రం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని సుర్సాగర్కు చెందిన 18 మంది టెంపో ట్రావెలర్లో కొలాయత్కు ఆలయ సందర్శన నుంచి తిరిగి వస్తుండగా హనుమాన్ సాగర్ కూడలి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించారు.
READ ALSO: JD Vance divorce: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ – ఉషకు విడాకులు ఇస్తాడా? వైరల్గా మారిన పోస్ట్!
Also Read
- Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ఫలోడి పోలీసు సూపరింటెండెంట్ కుందన్ కన్వారియా మృతుల సంఖ్యను ధృవీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ముగ్గురిని వెంటనే ఒసియన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని అక్కడి నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా జోధ్పూర్కు తరలించారు. ప్రమాద తీవ్రతకు టెంపో ట్రావెలర్ పూర్తిగా ఛిన్నాభిన్నమైందని ఫలోడి డీఎస్పీ అచల్ సింగ్ దేవ్డా పేర్కొన్నారు.
ఫలోడి పోలీస్ స్టేషన్ అధికారి అమనారామ్ మాట్లాడుతూ.. ప్రమాదం అనంతరం టెంపో ట్రావెలర్లో చాలా మృతదేహాలు తీవ్రంగా ఇరుక్కుపోయాయి. వాటిని తొలగించడానికి పోలీసులు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరణించిన, గాయపడిన వారందరూ జోధ్పూర్లోని సుర్సాగర్ ప్రాంత నివాసితులని చెప్పారు. వారు కొలాయత్ను సందర్శించిన తర్వాత వారి కుటుంబాలతో తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, సహాయ బృందాలు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జోధ్పూర్ పోలీస్ కమిషనర్ ఓం ప్రకాష్ మాథుర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. భారతమాల ఎక్స్ప్రెస్వేపై టెంపో ట్రావెలర్ అతి వేగం ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
READ ALSO: Iran Nuclear Program: ట్రంప్కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’
తాజావార్తలు
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి