Tempo Traveller Crash: కర్నూల్ బస్సు ప్రమాదం మరవ ముందే మరో ఘోరం.. 15 మంది మృతి!
- రాజస్థాన్లోని ఫలోడి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్
- అతివేగమే ప్రమాదానికి కారణం
- చిన్నాభిన్నం అయిన టెంపో ట్రావెలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tempo Traveller Crash: కర్నూల్ బస్సు ప్రమాదం మరవ ముందే మరో ఘోరం వెలుగు చూసింది. రాజస్థాన్లోని ఫలోడి జిల్లాలోని మటోడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భరత్మాల ఎక్స్ప్రెస్వేపై ఆదివారం సాయంత్రం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్పూర్లోని సుర్సాగర్కు చెందిన 18 మంది టెంపో ట్రావెలర్లో కొలాయత్కు ఆలయ సందర్శన నుంచి తిరిగి వస్తుండగా హనుమాన్ సాగర్ కూడలి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించారు.
READ ALSO: JD Vance divorce: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ – ఉషకు విడాకులు ఇస్తాడా? వైరల్గా మారిన పోస్ట్!
Also Read
- 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
- TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
- Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
- Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
ఫలోడి పోలీసు సూపరింటెండెంట్ కుందన్ కన్వారియా మృతుల సంఖ్యను ధృవీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ముగ్గురిని వెంటనే ఒసియన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని అక్కడి నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా జోధ్పూర్కు తరలించారు. ప్రమాద తీవ్రతకు టెంపో ట్రావెలర్ పూర్తిగా ఛిన్నాభిన్నమైందని ఫలోడి డీఎస్పీ అచల్ సింగ్ దేవ్డా పేర్కొన్నారు.
ఫలోడి పోలీస్ స్టేషన్ అధికారి అమనారామ్ మాట్లాడుతూ.. ప్రమాదం అనంతరం టెంపో ట్రావెలర్లో చాలా మృతదేహాలు తీవ్రంగా ఇరుక్కుపోయాయి. వాటిని తొలగించడానికి పోలీసులు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరణించిన, గాయపడిన వారందరూ జోధ్పూర్లోని సుర్సాగర్ ప్రాంత నివాసితులని చెప్పారు. వారు కొలాయత్ను సందర్శించిన తర్వాత వారి కుటుంబాలతో తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, సహాయ బృందాలు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జోధ్పూర్ పోలీస్ కమిషనర్ ఓం ప్రకాష్ మాథుర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. భారతమాల ఎక్స్ప్రెస్వేపై టెంపో ట్రావెలర్ అతి వేగం ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
READ ALSO: Iran Nuclear Program: ట్రంప్కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’
-
Simple Ultra: సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్.. 400KM రేంజ్, 115 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..