Rajasthan Horror: లైంగిక దాడిని ప్రతిఘటించిందని.. ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోశాడు..
- రాజస్థాన్లో దారుణం
- లైంగిక దాడిని ప్రతిఘటించిందని ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోసిన దుర్మార్గుడు
Rajasthan Horror: లైంగిక దాడిని ప్రతిఘటించిన ఓ మైనర్ బాలిక ప్రమాదంలో పడింది. అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించడంతో ఓ దుర్మార్గుడు 15 ఏళ్ల బాలికపై దాడి చేసి.. ఆ అమ్మాయిని మంచానికి కట్టేసి ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోశాడని పోలీసులు వెల్లడించారు. దీంతో ప్రైవేట్ భాగాల వద్ద కాలిన గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. జూన్ 14న రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్లోని జైసల్మీర్లో 15 ఏళ్ల మైనర్ బాలికను ఆమె తల్లి ప్రియుడు లైంగికంగా వేధించడానికి ప్రయత్నించగా, బాలిక వద్దని అడ్డుకోవడంతో ఆమెను కొట్టారు. ఆమె ప్రైవేట్ భాగాలపై నూనె పోశారు. బాలికకు చికిత్స అందించకుండా రెండు రోజులుగా గదిలో బంధించి, ఆమె ప్రైవేట్ పార్టులు దుర్వాసన రావడంతో బాలిక తల్లి ఆడుకుంటూ వేడి నూనెలో పడిపోయిందనే నెపంతో ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ బాలికను వైద్య చికిత్స కోసం తీసుకెళ్లిన తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. జులై 12న పోలీసులు పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మైనర్ బాలికను మంచానికి కట్టేసి దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుడు బాలిక ప్రైవేట్ భాగాలపై వేడి నూనె పోశారని, దీంతో కాలిన గాయాలయ్యాయని వారు పేర్కొన్నారు. ఈ ఘటన గురించి బాధితురాలు తన తల్లికి తెలియజేసింది. అయితే, ఆమె విషయాన్ని దాచడానికి ప్రయత్నించింది. దీని గురించి ఎవరికీ చెప్పవద్దని తన కుమార్తెకు చెప్పింది.
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
Read Also: Donald Trump: భారీ ప్లాన్లోనే వచ్చిన ట్రంప్ హత్యాయత్నం నిందితుడు.. కారులో పేలుడు పదార్థాలు..
ఈ ఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్లో మైనర్ బాలిక తన బాధను వివరించడంతో దాడి, అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సీడబ్ల్యూసీ ప్రెసిడెంట్ ముఖేష్ వ్యాస్ ఓ లేఖ రాసి ఘటనపై కేసు నమోదు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. ప్రస్తుతం బాధితురాలు సీడబ్ల్యూసీ సంరక్షణలో ఉంది. మైనర్ బాలిక ముంబై నివాసి అని అదనపు ఎస్పీ మహేంద్ర సింగ్ రాజ్వీ తెలిపారు. 2016లో తన తండ్రి చనిపోవడంతో బాధితురాలు జైసల్మేర్లో తల్లితో కలిసి నివసిస్తోందని తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
-
Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
-
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?