New Districts: రాష్ట్రంలో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రకటించిన ముఖ్యమంత్రి
New Districts: డివిజనల్ హెడ్క్వార్టర్కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్క్వార్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 19 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన శుక్రవారం నాడు ఈ ప్రకటన చేశారు. అయితే ఎన్నికల కోసమే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఈ చర్య తీసుకుందని బీజేపీ విమర్శించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలేనని ఆరోపించింది.
“భౌగోళిక విస్తీర్ణంలో రాజస్థాన్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. కొన్ని సందర్భాల్లో జిల్లా ప్రధాన కార్యాలయానికి 100 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటుంది. ప్రజలు జిల్లా కేంద్రాలకు సులభంగా చేరుకోలేకపోతున్నారు. ప్రతి కుటుంబానికి పరిపాలన చేరలేకపోతోంది.”అని రాజస్థాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గెహ్లాట్ అన్నారు. రాజస్థాన్లో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. మూడు కొత్త డివిజనల్ ప్రధాన కార్యాలయాలు పాలి, సికార్, బన్స్వారాలను ఏర్పాటు చేయనున్నారు. “జిల్లాలు చిన్నవిగా ఉంటే, అది సమర్థవంతమైన శాంతిభద్రతల నిర్వహణలో సహాయపడుతుంది. మెరుగైన పరిపాలన అందించబడుతుంది” అని మిస్టర్ గెహ్లాట్ అసెంబ్లీలో చెప్పారు.
Also Read
- IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..
- Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
Read Also: Andhra Pradesh Assembly: అసెంబ్లీలో గందరగోళం.. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలి..
రాజకీయ ప్రయోజనాల కోసమే గెహ్లాట్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే అన్నారు. కొత్త జిల్లాలను ప్రకటించడంలో చాలా ముఖ్యమైన అంశాలు విస్మరించబడ్డాయని ఆమె అన్నారు. ఈ చర్య మరింత పరిపాలనాపరమైన సవాళ్లను కలిగిస్తుందన్నారు. అశోక్ గెహ్లాట్ కొత్త జిల్లాల ఏర్పాటు మొదటి దశలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మానవ వనరుల కోసం రూ. 2,000 కోట్ల బడ్జెట్ను ప్రతిపాదించారు. పదిహేనేళ్ల క్రితం ఎమ్మెల్యే వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతాప్గఢ్ను జిల్లాగా ఏర్పాటు చేశారు.
కొత్త జిల్లాలు: అనూప్గఢ్, ఇది గంగానగర్లో భాగంగా ఉంది. బలోత్రా (బార్మెర్), బీవర్ (అజ్మీర్), కేక్రీ (అజ్మీర్), దీగ్ (భరత్పూర్), దీద్వానా-కుచమన్ (నాగౌర్), డూడు (జైపూర్), గంగాపూర్ సిటీ (సవాయి మాధోపూర్), జైపూర్ నార్త్, జైపూర్ సౌత్, జోధ్పూర్ ఈస్ట్, జోధ్పూర్ వెస్ట్ , కోట్పుత్లీ-బెహ్రోర్ (జైపూర్-అల్వార్), ఖేర్తాల్ (అల్వార్), నీమ్ క థానా (సికార్), ఫలోడి (జోధ్పూర్), సలుంబర్ (ఉదయ్పూర్), సంచోర్ (జలోర్). షాపురా (భిల్వారా).
ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని వేడెక్కించాయి. రెండు పార్టీలు రాజస్థాన్లోని ఎన్నికలపరంగా ముఖ్యమైన గుజ్జర్ వర్గానికి చేరువ కావడం గత నెలలో కనిపించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 9 నుండి 12 శాతం వరకు ఉన్న గుజ్జర్లు, తూర్పు రాజస్థాన్లోని 40 నుండి 50 అసెంబ్లీ స్థానాల్లో గణనీయంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ కీలకమైన ఓటు బ్యాంకు. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో రెబల్ సంక్షోభం నెలకొంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ చాలా కాలంగా విభేదిస్తున్నారు. ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం ఉన్నప్పటికీ, ఇద్దరూ ఒకరినొకరు సూక్ష్మబుద్ధితో రెచ్చగొట్టడం ప్రారంభించారు. గెహ్లాట్ 156 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, 1998లో కాంగ్రెస్ తన నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సాధించిన అదే సంఖ్య.
తాజావార్తలు
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
-
KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు
-
Vivo T5x 5G: భారీగా తగ్గిన వివో T5x 5G ధర.. 50MP Sony కెమెరా + 120Hz డిస్ప్లే + 7200mAh
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!