Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rajasthan Creates 19 New Districts In Poll Year Bjp Says Political Move

New Districts: రాష్ట్రంలో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రకటించిన ముఖ్యమంత్రి

Published Date :March 18, 2023 , 10:09 am
By Mahesh Jakki
New Districts: రాష్ట్రంలో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. ప్రకటించిన ముఖ్యమంత్రి
  • Follow Us :
  • google news
  • dailyhunt

New Districts: డివిజనల్ హెడ్‌క్వార్టర్‌కు దూరంగా నివసించే ప్రజల అవసరాలను తీర్చడానికి 19 కొత్త జిల్లాలు, మరో మూడు డివిజనల్ హెడ్‌క్వార్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో 19 కొత్త జిల్లాలు, మూడు కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆయన శుక్రవారం నాడు ఈ ప్రకటన చేశారు. అయితే ఎన్నికల కోసమే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ఈ చర్య తీసుకుందని బీజేపీ విమర్శించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలేనని ఆరోపించింది.

“భౌగోళిక విస్తీర్ణంలో రాజస్థాన్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. కొన్ని సందర్భాల్లో జిల్లా ప్రధాన కార్యాలయానికి 100 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటుంది. ప్రజలు జిల్లా కేంద్రాలకు సులభంగా చేరుకోలేకపోతున్నారు. ప్రతి కుటుంబానికి పరిపాలన చేరలేకపోతోంది.”అని రాజస్థాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గెహ్లాట్ అన్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. మూడు కొత్త డివిజనల్ ప్రధాన కార్యాలయాలు పాలి, సికార్, బన్స్వారాలను ఏర్పాటు చేయనున్నారు. “జిల్లాలు చిన్నవిగా ఉంటే, అది సమర్థవంతమైన శాంతిభద్రతల నిర్వహణలో సహాయపడుతుంది. మెరుగైన పరిపాలన అందించబడుతుంది” అని మిస్టర్ గెహ్లాట్ అసెంబ్లీలో చెప్పారు.

Read Also: Andhra Pradesh Assembly: అసెంబ్లీలో గందరగోళం.. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలి..

రాజకీయ ప్రయోజనాల కోసమే గెహ్లాట్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే అన్నారు. కొత్త జిల్లాలను ప్రకటించడంలో చాలా ముఖ్యమైన అంశాలు విస్మరించబడ్డాయని ఆమె అన్నారు. ఈ చర్య మరింత పరిపాలనాపరమైన సవాళ్లను కలిగిస్తుందన్నారు. అశోక్ గెహ్లాట్ కొత్త జిల్లాల ఏర్పాటు మొదటి దశలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మానవ వనరుల కోసం రూ. 2,000 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. పదిహేనేళ్ల క్రితం ఎమ్మెల్యే వసుంధర రాజే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతాప్‌గఢ్‌ను జిల్లాగా ఏర్పాటు చేశారు.

కొత్త జిల్లాలు: అనూప్‌గఢ్, ఇది గంగానగర్‌లో భాగంగా ఉంది. బలోత్రా (బార్మెర్), బీవర్ (అజ్మీర్), కేక్రీ (అజ్మీర్), దీగ్ (భరత్‌పూర్), దీద్వానా-కుచమన్ (నాగౌర్), డూడు (జైపూర్), గంగాపూర్ సిటీ (సవాయి మాధోపూర్), జైపూర్ నార్త్, జైపూర్ సౌత్, జోధ్‌పూర్ ఈస్ట్, జోధ్‌పూర్ వెస్ట్ , కోట్‌పుత్లీ-బెహ్రోర్ (జైపూర్-అల్వార్), ఖేర్తాల్ (అల్వార్), నీమ్ క థానా (సికార్), ఫలోడి (జోధ్‌పూర్), సలుంబర్ (ఉదయ్‌పూర్), సంచోర్ (జలోర్). షాపురా (భిల్వారా).

ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని వేడెక్కించాయి. రెండు పార్టీలు రాజస్థాన్‌లోని ఎన్నికలపరంగా ముఖ్యమైన గుజ్జర్ వర్గానికి చేరువ కావడం గత నెలలో కనిపించింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 9 నుండి 12 శాతం వరకు ఉన్న గుజ్జర్లు, తూర్పు రాజస్థాన్‌లోని 40 నుండి 50 అసెంబ్లీ స్థానాల్లో గణనీయంగా ఉన్నారు. ఇది కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ కీలకమైన ఓటు బ్యాంకు. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో రెబల్‌ సంక్షోభం నెలకొంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ చాలా కాలంగా విభేదిస్తున్నారు. ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం ఉన్నప్పటికీ, ఇద్దరూ ఒకరినొకరు సూక్ష్మబుద్ధితో రెచ్చగొట్టడం ప్రారంభించారు. గెహ్లాట్ 156 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, 1998లో కాంగ్రెస్ తన నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సాధించిన అదే సంఖ్య.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashok Gehlot
  • bjp
  • congress
  • divisional headquarters
  • New Districts

తాజావార్తలు

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Moinabad Farmhouse Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్..

  • Suyodhana Teaser: సస్పెన్స్ మిస్టరీతో ‘సుయోధన’ టీజర్

  • Tirumala: తిరుమలలో మండువేసవిలో మంచు..

  • Air India: ఎయిర్ ఇండియాలో బయటపడ్డ భారీ కుంభకోణం.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన టాటా గ్రూప్!

ట్రెండింగ్‌

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
advertisement will close in 5 seconds ×
ads