Site icon NTV Telugu

Rajamouli: ‘వారణాసి’ కోసం క్యూ కడుతున్న డిస్ట్రిబ్యూటర్లు.. కానీ జక్కన్న ప్లాన్ ఇదే!

Rajamouli

Rajamouli

Rajamouli: బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌కి దూసుకువెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా హాలివుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

READ ALSO: Kadiyam Srihari : కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు

ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని కోకాపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు- ప్రియాంక చోప్రాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఈ షెడ్యూల్ క్లోజ్ అయిన వెంటనే, చిత్ర బృందం జార్జియా వెళ్లడానికి రడీ అవుతుందని సమాచారం. ఇదే టైంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఏపీ, తూర్పు గోదావరి ఏరియాకు రూ.18 కోట్ల ఆఫర్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి ఈ రేంజ్‌లో భారీ ఆఫర్లు వచ్చినా తక్షణమే బిజినెస్ స్టార్ట్ చేసేందుకు జక్కన్న టీమ్ ఆసక్తిగా లేదని సమాచారం. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహాలోనే వారణాసి మూవీ విషయంలో కూడా రాజమౌళి స్ట్రాటజీ ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే వారణాసి సినిమా పూర్తయ్యాకే పూర్తి స్థాయి మార్కెట్ వ్యూహంతో డిస్ట్రిబ్యూషన్‌కు వెళ్లాలని రాజమౌళి టీం ప్లాన్ అని చెబుతున్నారు.

READ ALSO: Superstar Rajinikanth: పారిశుద్ధ్య కార్మికురాలికి గిఫ్ట్ ఇచ్చిన సూపర్‌ స్టార్.. ఇది నిజాయితీకి దక్కిన గుర్తింపు!

Exit mobile version