Superstar Rajinikanth: పారిశుద్ధ్య కార్మికురాలికి గిఫ్ట్ ఇచ్చిన సూపర్ స్టార్.. ఇది నిజాయితీకి దక్కిన గుర్తింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Superstar Rajinikanth: నిజాయితీకి రోజులు లేవని అనే వారికి ఈ ఘటన ఒక మంచి ఉదాహరణ. నిజానికి మీలో ఎవరికైనా 45 తులాల బంగారు గొలుసు రోడ్డుపై దొరికితే ఏం చేస్తారు.. ఎవరు మనల్ని చూడటం లేదుగా అని చూసి, ఆ గొలుసును తీసుకొని జేబులో వేసుకుంటామా లేదా. కానీ ఈవిడ మాత్రం అలా చేయలేదు. తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన తన నిజాయతీని చాటుకుంది ఒక పారిశుద్ధ్య కార్మికురాలు. నిజాయితీకి ఉండే పవర్ ఎలాంటిది అంటే.. ఈ విషయం సూపర్ స్టార్ రజనీకాంత్ దృష్టికి వెళ్లింది. అసలు ఏం జరిగిందంటే..
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
చెన్నై మహానగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50) అనే మహిళకు ఇటీవల రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారం దొరికింది. వాస్తవానికి ఆమె తనకు దొరికిన ఆ బంగారంపై ఎలాంటి ఆశపడలేదు. నిజాయితీగా తనకు దొరికిన ఆ 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించింది. ఈ క్రమంలో పలువురు స్థానికులు ఆమెను అభినందించారు. తాజాగా విషయం తెలుసుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇంటికి పిలిచి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి, ఆమెను సన్మానించారు. అనంతరం ఆమెకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక బంగారపు గొలుసును గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే భారత తపాలా శాఖ కూడా పద్మ నిజాయితీకి మెచ్చి అరుదైన గౌరవాన్ని అందించింది. ఇటీవల ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును భారత తపాలా శాఖ రిలీజ్ విడుదల చేసింది. దీంతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా ఇచ్చారు. అలాగే ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించారు.
ఈ విషయం తెలుసుకున్న లలిత జువెలరీ అధినేత డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ కూడా పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను వారింటికి పిలిపించి ఘనంగా సత్కరించారు. ఆమెకు శాలువా కప్పి సత్కరించడమే కాకుండా, ఒక వెండి పళ్ళాన్ని కానుకగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “లక్షల విలువైన బంగారం దొరికినప్పుడు మనసు చలించకుండా ఉండటం సామాన్యమైన విషయం కాదు. పద్మ వంటి వారు సమాజానికి ఆదర్శప్రాయులు” అని కొనియాడారు.
READ ALSO: Maharashtra: మంత్రి పంకజ ముండేకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా..!
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!