Superstar Rajinikanth: పారిశుద్ధ్య కార్మికురాలికి గిఫ్ట్ ఇచ్చిన సూపర్ స్టార్.. ఇది నిజాయితీకి దక్కిన గుర్తింపు!
Superstar Rajinikanth: నిజాయితీకి రోజులు లేవని అనే వారికి ఈ ఘటన ఒక మంచి ఉదాహరణ. నిజానికి మీలో ఎవరికైనా 45 తులాల బంగారు గొలుసు రోడ్డుపై దొరికితే ఏం చేస్తారు.. ఎవరు మనల్ని చూడటం లేదుగా అని చూసి, ఆ గొలుసును తీసుకొని జేబులో వేసుకుంటామా లేదా. కానీ ఈవిడ మాత్రం అలా చేయలేదు. తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన తన నిజాయతీని చాటుకుంది ఒక పారిశుద్ధ్య కార్మికురాలు. నిజాయితీకి ఉండే పవర్ ఎలాంటిది అంటే.. ఈ విషయం సూపర్ స్టార్ రజనీకాంత్ దృష్టికి వెళ్లింది. అసలు ఏం జరిగిందంటే..
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
చెన్నై మహానగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50) అనే మహిళకు ఇటీవల రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారం దొరికింది. వాస్తవానికి ఆమె తనకు దొరికిన ఆ బంగారంపై ఎలాంటి ఆశపడలేదు. నిజాయితీగా తనకు దొరికిన ఆ 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించింది. ఈ క్రమంలో పలువురు స్థానికులు ఆమెను అభినందించారు. తాజాగా విషయం తెలుసుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇంటికి పిలిచి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి, ఆమెను సన్మానించారు. అనంతరం ఆమెకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక బంగారపు గొలుసును గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే భారత తపాలా శాఖ కూడా పద్మ నిజాయితీకి మెచ్చి అరుదైన గౌరవాన్ని అందించింది. ఇటీవల ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును భారత తపాలా శాఖ రిలీజ్ విడుదల చేసింది. దీంతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా ఇచ్చారు. అలాగే ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించారు.
ఈ విషయం తెలుసుకున్న లలిత జువెలరీ అధినేత డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ కూడా పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను వారింటికి పిలిపించి ఘనంగా సత్కరించారు. ఆమెకు శాలువా కప్పి సత్కరించడమే కాకుండా, ఒక వెండి పళ్ళాన్ని కానుకగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “లక్షల విలువైన బంగారం దొరికినప్పుడు మనసు చలించకుండా ఉండటం సామాన్యమైన విషయం కాదు. పద్మ వంటి వారు సమాజానికి ఆదర్శప్రాయులు” అని కొనియాడారు.
READ ALSO: Maharashtra: మంత్రి పంకజ ముండేకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా..!
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?