Varanasi: రెండు భాగాలుగా ‘వారణాసి’.. జక్కన్న రియాక్షన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ‘ధురందర్’, ‘ధురందర్ 2’ చిత్రాలు సాధించిన అఖండ విజయం రాజమౌళి ఆలోచనా విధానాన్ని మార్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మెగా స్టోరీని కేవలం మూడు గంటల్లో చెబితే న్యాయం జరగదని, అందుకే సినిమాను రెండు భాగాలుగా తీసుకురావాలని నిర్మాతలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
READ ALSO: Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
కథ బలంగా ఉంటే ప్రేక్షకులు రెండు భాగాలుగా చూడటానికి సిద్ధంగా ఉన్నారని ‘ధురందర్’ నిరూపించడంతో, రాజమౌళి కూడా తన కథను ఎలాంటి తొందరపాటు లేకుండా విడతల వారీగా వెండితెరపైకి తేవాలని భావిస్తున్నట్లు ఈ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ వార్తలను రాజమౌళి గతంలోనే ఖండించడం గమనార్హం. గత నెలలో ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న మాట్లాడుతూ.. ‘వారణాసి’కి సీక్వెల్స్ ఉండవని, ఇది ఒకే భాగంగా వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇది మూడు గంటలకు పైగా నిడివి ఉండే ఒకే చిత్రంగా ఉంటుందని చెప్పారు. బాహుబలి, ‘RRR’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు ‘వారణాసి’తో మరో గ్లోబల్ బ్లాక్ బస్టర్పై కన్నేశారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
READ ALSO: IPL 2026: ఆర్సీబీ తుది జట్టు ఇదే.. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఆ స్టార్ ప్లేయరేనా!
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!