AP Liquor Scam Case: జడ్జి ఎదుట కంటతడి పెట్టిన రాజ్ కేసిరెడ్డి.. రూ.11 కోట్లపై కోర్టు కీలక ఆదేశాలు..!
- ఏసీబీ కోర్టుకు లిక్కర్ కేసు ఏ1 రాజ్ కేసిరెడ్డి..
- న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టిన కేసిరెడ్డి..
- తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు లింక్ పెడుతున్నారు..
- ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి..
- ఆ నగదును ఫోటోగ్రాఫ్లు తీయాలని కోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు సిట్ పోలీసులు.. అయితే, న్యాయమూర్తి ఎదుట కంట తడి పెట్టారు రాజ్ కేసిరెడ్డి.. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరాడు కేసిరెడ్డి.. తాను 2024 జూన్ లో ఆ డబ్బు వరుణ్ కి ఇచ్చినట్టు చెబుతున్నారని.. ఆ నోట్లు RBI ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
45 ఏళ్ల క్రితం కొన్న ఆస్తులకు నేను దానికి బినామీ అంటున్నారని వాపోయాడు రాజ్ కేసిరెడ్డి.. తన వయసు 43 అని.. తాను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ అయ్యనా? అని కోర్టు ఎదుట కంటతడి పెట్టాడు కేసిరెడ్డి.. 11 కోట్ల నగదు బాక్సులు తానే అందించినట్టు చెబుతున్నారని.. ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా..? దాన్ని పరిశీలించాలని కోరాడు.. ఇక, ఛార్జిషీట్ వేసిన సమయంలో మాపై దర్యాప్తు ముగిసినట్టు పీపీ కోర్టులో చెప్పారని.. ఇప్పుడు కొత్త కొత్త విషయాలు మాకు సంబంధం అంటున్నారని.. ఈ విషయాలు పరిశీలించాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.. అయితే, సిట్ సీజ్ చేసిన ఆ రూ.11 కోట్లపై ఏసీబీ కోర్టు జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆ నగదును ఫోటోగ్రాఫ్లు తీయాలని సిట్కి ఆదేశాలు జారీ చేశారు విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి..
తాజావార్తలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
-
Peddi : ‘పెద్ది’ బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
-
BCCI Meeting: సూర్యకుమార్ టీ20 కెప్టెన్సీపై కీలక నిర్ణయం?.. బీసీసీఐ సమావేశంలో హాట్ టాపిక్!
-
Sreeleela: శ్రీలీల – తిలక్ వర్మ రిలేషన్షిప్పై షాకింగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..