Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert in Andhra Pradesh & Telangana for 3 Days: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వివరాల ప్రకారం.. ముఖ్యంగా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, సూర్యపేట, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. రైతులు, ప్రయాణికులు సైతం వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
READ MORE: IPL Effect : సినిమా కలెక్షన్స్కు గండికొడుతున్న ఐపీయల్
Also Read
- Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వర్షం వచ్చేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్ల కింద అస్సలు ఉండొద్దు. వాటికి పిడుగు ముప్పు మరింత ఎక్కవని గమనించాలి. ఇంటి ఆవరణలో భూమిలోపల ఉప్పు, కర్ర బొగ్గు, రాగి వైరుతో ఎర్త్ ఏర్పాటు చేయించడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, తదితర విద్యుత్ గృహోపకరణల ప్లగ్స్ స్విచ్ బోర్డు నుంచి తీసివేయాలి. పిడుగులు తాటి చెట్లు, విద్యుత్ స్తంభాల మీద ఎకువగా పడుతుంటాయి. కాబట్టి వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఒక్కోసారి పిడుగు పడ్డ ప్రదేశంలోనే మరోసారి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లకూడదు. వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోర్డులు, కెమెరాలు, సెల్ఫోన్లు దగ్గర ఉంచుకోక పోవడం చాలా మంచిది. పశువులను గుడిసెలు, కొట్టాలు, షెడ్లలో కట్టివేయాలి. చెట్ల కింద ఉంచ్చొద్దు. ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు రైతులు పొలాల వద్ద ఉండకూడదు.
తాజావార్తలు
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, రామ్చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!