Rain Alert: ఈ మూడు రోజులు అలర్ట్.. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్ష సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert in Andhra Pradesh & Telangana for 3 Days: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వివరాల ప్రకారం.. ముఖ్యంగా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, సూర్యపేట, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. రైతులు, ప్రయాణికులు సైతం వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
READ MORE: IPL Effect : సినిమా కలెక్షన్స్కు గండికొడుతున్న ఐపీయల్
Also Read
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వర్షం వచ్చేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్ల కింద అస్సలు ఉండొద్దు. వాటికి పిడుగు ముప్పు మరింత ఎక్కవని గమనించాలి. ఇంటి ఆవరణలో భూమిలోపల ఉప్పు, కర్ర బొగ్గు, రాగి వైరుతో ఎర్త్ ఏర్పాటు చేయించడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, తదితర విద్యుత్ గృహోపకరణల ప్లగ్స్ స్విచ్ బోర్డు నుంచి తీసివేయాలి. పిడుగులు తాటి చెట్లు, విద్యుత్ స్తంభాల మీద ఎకువగా పడుతుంటాయి. కాబట్టి వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఒక్కోసారి పిడుగు పడ్డ ప్రదేశంలోనే మరోసారి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లకూడదు. వర్ష సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోర్డులు, కెమెరాలు, సెల్ఫోన్లు దగ్గర ఉంచుకోక పోవడం చాలా మంచిది. పశువులను గుడిసెలు, కొట్టాలు, షెడ్లలో కట్టివేయాలి. చెట్ల కింద ఉంచ్చొద్దు. ఉరుములు, మెరుపులతో వర్షం పడినప్పుడు రైతులు పొలాల వద్ద ఉండకూడదు.
తాజావార్తలు
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!