Railway Fare: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చార్జీలు పెంచబోమన్న రైల్వే మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Fare: భారతీయ రైల్వేలను మెరుగుపరచడానికి స్టేషన్ల పునరాభివృద్ధి కింద, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 508 రైల్వే స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అనుసంధానించబడతాయి. అయితే స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో రైల్వే ఛార్జీలు పెంచబోమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. రైల్వేల రీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రూ.25,000 కోట్లు అవసరమవుతాయని, ప్రస్తుత రైల్వే బడ్జెట్ ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, ఈ క్రమంలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ఒక అడుగు అని అన్నారు. దేశ ప్రజలకు ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రపంచ స్థాయి స్టేషన్ల సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నాం. రైలు ఛార్జీలను పెంచడం లేదా రైల్వే రీడెవలప్మెంట్ రుసుము వంటివి విధించడం లేదని కూడా రైల్వే మంత్రి చెప్పారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Read Also:Mukesh Ambani Salary: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం
1300స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లు’గా అభివృద్ధి
దేశంలోని దాదాపు 1300 ప్రధాన స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లుగా’ రీ డెవలప్ చేసేందుకు రైల్వే ప్రణాళిక రూపొందించింది. ఇందులో 508 అమృత్ భారత్ స్టేషన్లకు ఆదివారం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో సుమారు రూ.4,000 కోట్లతో 55 స్టేషన్లు, మధ్యప్రదేశ్లో 34 స్టేషన్లు రూ.1,000 కోట్లతో, మహారాష్ట్రలో 44 స్టేషన్లను రూ.1,500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళతో సహా అనేక రైల్వే స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తారు.
9000 మంది ఇంజనీర్లకు శిక్షణ
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా సుమారు 9000 మంది ఇంజనీర్లకు శిక్షణ ఇస్తోందని, తద్వారా ప్రాజెక్ట్ సూక్ష్మ నైపుణ్యాలపై వారికి అవగాహన కల్పించవచ్చు. ఇందులో కాంట్రాక్ట్ డాక్యుమెంట్లు, ఆర్కిటెక్చర్, డిజైన్, సెక్యూరిటీ విశ్లేషణ ఉంటుంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?