Railway Fare: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చార్జీలు పెంచబోమన్న రైల్వే మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Fare: భారతీయ రైల్వేలను మెరుగుపరచడానికి స్టేషన్ల పునరాభివృద్ధి కింద, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం 508 రైల్వే స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అనుసంధానించబడతాయి. అయితే స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో రైల్వే ఛార్జీలు పెంచబోమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు. రైల్వేల రీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు రూ.25,000 కోట్లు అవసరమవుతాయని, ప్రస్తుత రైల్వే బడ్జెట్ ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, ఈ క్రమంలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ఒక అడుగు అని అన్నారు. దేశ ప్రజలకు ఎలాంటి అదనపు భారం పడకుండా ప్రపంచ స్థాయి స్టేషన్ల సౌకర్యాలు కల్పించాలనుకుంటున్నాం. రైలు ఛార్జీలను పెంచడం లేదా రైల్వే రీడెవలప్మెంట్ రుసుము వంటివి విధించడం లేదని కూడా రైల్వే మంత్రి చెప్పారు.
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
Read Also:Mukesh Ambani Salary: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం
1300స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లు’గా అభివృద్ధి
దేశంలోని దాదాపు 1300 ప్రధాన స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్లుగా’ రీ డెవలప్ చేసేందుకు రైల్వే ప్రణాళిక రూపొందించింది. ఇందులో 508 అమృత్ భారత్ స్టేషన్లకు ఆదివారం ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో సుమారు రూ.4,000 కోట్లతో 55 స్టేషన్లు, మధ్యప్రదేశ్లో 34 స్టేషన్లు రూ.1,000 కోట్లతో, మహారాష్ట్రలో 44 స్టేషన్లను రూ.1,500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళతో సహా అనేక రైల్వే స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తారు.
9000 మంది ఇంజనీర్లకు శిక్షణ
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా సుమారు 9000 మంది ఇంజనీర్లకు శిక్షణ ఇస్తోందని, తద్వారా ప్రాజెక్ట్ సూక్ష్మ నైపుణ్యాలపై వారికి అవగాహన కల్పించవచ్చు. ఇందులో కాంట్రాక్ట్ డాక్యుమెంట్లు, ఆర్కిటెక్చర్, డిజైన్, సెక్యూరిటీ విశ్లేషణ ఉంటుంది.
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..