Vande Bharat Express: ‘వందేభారత్’లో ప్రయాణం మరింత సౌకర్యవంతం.. మార్పులు చేయనున్న రైల్వేశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Changes in Vande Bharat Express: దూర ప్రాంతాలకు చేరేందుకు నేటికి చాలా మంది సామాన్యుల ప్రయాణ సాధనం రైళ్లు. అయితే గతంతో పోలిస్తే భారత రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు సంతరించుకున్నారు. ప్రయాణీకులు సౌకర్యార్థం అనేక మార్పులు చేశారు. ప్రస్తుతానికి వేగవంతంగా, సురక్షితంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. అది వరకు పట్టే సమయంలో సగం మాత్రమే పడుతుంది. అయితే ఈ రైళ్లలో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న వాటిలో 25 మార్పులు వరకు చేసింది.
Also Read: Norman Borlaug Award: ఒడిశా యువతికి నార్మన్ బోర్లాగ్ అవార్డ్
ఎనిమిది గంటల పాటు కూర్చుని ప్రయాణం చేయాల్సి రావడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారన్న భావనతోనే ఈ మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొ్న్నారు. సీట్లు మరింత వెనక్కు వెళ్లేలా పుష్ బ్యాక్ లో మార్పులు చేశారు. దీని ద్వారా నిద్రపోయేందుకు ఎక్కువ వెనక్కు వాలే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సీట్ల మెత్తదనాన్ని కూడా పెంచారు. మరుగుదొడ్లలో ఎక్కువ వెలుతురు వచ్చేలా చేశారు. మొబైల్ చార్జింగ్ పాయింట్, ఫుట్రెస్ట్లోనూ సౌకర్యవంతంగా ఉండేలా మార్పులు చేశారు. ఏసీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా కూడా రైల్వే శాఖ మార్పులు చేసింది. ఇక ఈ నెల 24న ప్రధాని మోడీ చేతుల మీదుగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.రాజస్థాన్, మధ్యప్రదేశ్తో సహా కేరళ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఒకే రోజు రికార్డు స్థాయిలో తొమ్మిది రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వీటిని వర్చువల్ పద్దతిలో ఆయన ప్రారంభిస్తారు. ఈ సర్వీసులతో కలిసి దేశంలో మొత్తం వందే భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులు 34కు చేరునున్నాయి. అలాగే భవిష్యత్తుల్లో మరో 10 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను సిద్ధం చేయాలన్న ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల రంగు నీలం కాకుండా ఇవి ఆరెంజ్ కలర్ లో కనిపించనున్నాయి.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!