T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్ రన్ రేట్ దెబ్బకొడుతుందా?
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం ముటగట్టుకున్న భారత్, ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఈ ఓటమితో భారత్కు సెమీఫైనల్ చేరడం ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ -3.800 గా ఉంది. ఇది అభిమానులను తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది.
READ ALSO: WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకున్న వాట్సాప్..
Also Read
- DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
భారత్ ముందున్న మ్యాచులు ఇవే..
సెమీస్ చేరాలంటే టీమిండియా తన నెక్ట్స్ రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్తో తలపడబోతుంది. టీమిండియా సెమీస్ చేరాలంటే ఉన్న ఛాన్స్లు ఏమిటంటే.. దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్ల్లోనూ (జింబాబ్వే, విండీస్) గెలవాలి. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్లు గెలిస్తే, రన్ రేట్ తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ కి వెళ్తుంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు.. జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై గెలిస్తే.. అప్పుడు భారత్, విండీస్, సౌతాఫ్రికా మూడూ తలో రెండు విజయాలతో సమానంగా ఉంటాయి. అప్పుడు ఎవరి రన్ రేట్ బాగుంటే వారే సెమీస్ కి వెళ్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ మైనస్లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.
2012 నాటి సీన్ రిపీట్ అవుతుందా..
సరిగ్గా 14 ఏళ్ల క్రితం (2012లో) టీమిండియాకు ఇలాగే జరిగింది. అప్పుడు సూపర్-8లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై గెలిచినప్పటికీ.. ఆస్ట్రేలియా కంటే తక్కువ రన్ రేట్ ఉండటంతో భారత్ సెమీస్ చేరకుండానే ఇంటికి వచ్చేసింది. ఆ టోర్నీలో భారత్ 3 మ్యాచ్ల్లో 2 గెలిచినా రన్ రేట్ వల్ల సెమీస్కు చేరకుండా తిరిగి రావాల్సి వచ్చింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మెరుగైన రన్ రేట్తో సెమీస్కి వెళ్లాయి. ఆ మెగా టోర్నీలో చివరికి వెస్టిండీస్ కప్పు కొట్టింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు, రన్ రేట్ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే 2012 నాటి కథే మళ్లీ పునరావృతం అవుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
DC Vs RCB: చెత్త రికార్డు మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 6 ఓవర్లలోపే చేతులెత్తేశారుగా..
-
Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి ‘ఫస్ట్’కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!